అయోధ్యతో పర్యాటకం జోరు
అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం కావడంతో, ఈ చారిత్రక నగరం ఇకపై అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగులీననుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫ్రీస్ తన తాజా నివేదికలో అంచనా వేసింది.
ఏటా 5 కోట్ల మంది సందర్శించే అవకాశం
హోటళ్లు, ప్రయాణ, ఆహార సంస్థలకు గిరాకీ
బ్రోకరేజీ సంస్థ జెఫ్రీస్ అంచనా
దిల్లీ: అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం కావడంతో, ఈ చారిత్రక నగరం ఇకపై అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగులీననుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫ్రీస్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. ఏడాదికి 5 కోట్ల మంది ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించే వీలుందని పేర్కొంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని, అయోధ్యలో 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.83,000 కోట్లు) వ్యయంతో వసతులు కల్పించబోతున్నారు.
ఇండియన్ హోటల్స్, ఐటీసీ, మారియట్, ఓయో వంటి ప్రముఖ బ్రాండ్ల హోటళ్లు ఇక్కడ కొలువుదీరనున్నాయి. బర్గర్కింగ్, మెక్డొనాల్డ్స్, జుబిలెంట్ ఫుడ్స్, దేవ్యాని ఇంటర్నేషనల్ వంటి ఆహార విక్రయ సంస్థలు తమ శాఖలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇండిగో, ఎయిరిండియా, స్పైస్జెట్, ఆకాశ ఎయిర్ వంటి సంస్థలు విమాన సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ఫలితంగా దేశీయంగా పలు రాష్ట్రాల నుంచి - అంతర్జాతీయ పర్యాటకులు భారీగా తరలి వచ్చే వీలుంది. హోటళ్ల సామర్థ్యం 5 రెట్లు పెరగనుండగా.. ఆహార, ప్రయాణ వ్యాపారాలూ ఊపందుకుంటాయని చెబుతున్నారు.
వడివడిగా నిర్మాణాలు..
ప్రస్తుతం అయోధ్య చుట్టుపక్కల ఉన్న 17 హోటళ్లలో 590 గదులు ఉన్నాయి. మరో 73 కొత్త హోటళ్లు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 40 హోటళ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇండియన్ హోటల్స్ అయోధ్యలో 2 కొత్త ఒప్పందాలు చేసుకుంది. ఇవి 2027 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. ఓయో 1,000 హోటల్ గదులను ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. 2023 ప్రథమార్ధంలోనే బర్గర్ కింగ్ ఇక్కడ తన స్టోర్ ఏర్పాటు చేసింది. బ్రిటానియా ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్జూమర్, ఐటీసీ, వెస్ట్లైఫ్ ఫుడ్వరల్డ్, హెచ్యూఎల్, దేవ్యాని ఇంటర్నేషనల్, సఫైర్ ఫుడ్స్ వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలూ ఇక్కడ భారీగా విక్రయాలు జరిపే వీలుంది.
వేగంగా విమానాలు..
ఇండిగో సంస్థ దిల్లీ, అహ్మదాబాద్, ముంబయి నుంచి, ఎయిరిండియా బెంగళూరు, కోల్కతా, దిల్లీ నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు నడుపుతున్నట్లు ప్రకటించాయి. స్పైస్జెట్, ఆకాశ ఎయిర్ కూడా వివిధ నగరాల నుంచి అయోధ్యకు విమానాలను నిర్వహించనున్నాయి. ఐఆర్సీటీసీ అయోధ్యకు పర్యాటక ప్యాకేజీలను ప్రకటించింది. మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్ వంటి కంపెనీలు అయోధ్య ప్రయాణాలతో లబ్ధిపడతాయి.
జీడీపీకి ఊతం
2018-19 ఆర్థిక సంవత్సరంలో (కొవిడ్కు ముందు) దేశ జీడీపీకి పర్యాటక రంగం 194 బిలియన్ డాలర్ల (సుమారు రూ.16.10 లక్షల కోట్ల)ను జత చేయగా, 2032-33 నాటికి 8 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్)తో ఇది 443 బి.డాలర్ల (సుమారు రూ.36.77 లక్షల కోట్ల)కు చేరుతుందనే అంచనా ఉంది. జీడీపీలో పర్యాటక రంగ వాటా మన దేశంలో 6.8 శాతం కాగా, వర్థమాన/అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది మరో 3-5 శాతం ఎక్కువగా ఉంది.
అత్యధిక సందర్శకులిక్కడే..
దేశంలో చూస్తే అమృత్సర్లోని స్వర్ణదేవాలయాన్ని 3-3.5 కోట్ల మంది, ఆంధ్ర ప్రదేశ్లోని తిరుమలను 2.5-3 కోట్ల మంది ఏటా దర్శిస్తున్నారని అంచనా. అంతర్జాతీయంగా సౌదీ అరేబియాలోని మక్కాను 2 కోట్ల మంది, వాటికన్ సిటీని 90 లక్షల మంది వార్షికంగా సందర్శిస్తున్నారు. వీటితో పోలిస్తే సందర్శకుల విషయంలో అయోధ్య ముందు నిలిచే అవకాశం కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?