Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
పేటీఎంను (Paytm) కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదు. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, వాలెట్లు, ఫాస్ట్ట్యాగ్లు, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్అప్లు కూడా అప్పటి నుంచి చేయకూడదు’ అని ఆర్బీఐ తెలిపింది. పీపీబీఎల్ కార్యకలాపాలపై బయటి ఆడిటర్లు పూర్తి స్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఆడిట్లో తేలినందునే సంస్థపై మరింతగా పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సి వస్తోందని ఆర్బీఐ వెల్లడించింది.
ఇప్పటి దాకా 70% పతనం: పీపీబీఎల్పై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో దాని మాతృ సంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్ (Paytm) షేరు గత రెండు ట్రేడింగ్ రోజుల్లో (గురు, శుక్రవారం) 40 శాతం నష్టపోయింది. శుక్రవారం 20 శాతం నష్టంతో రూ.487.05 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ 2 రోజుల్లో రూ.17,378.41 కోట్లు కోల్పోయి రూ.30,931.59 కోట్లకు పరిమితమైంది. 2021లో రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2,150 ఇష్యూ ధరతో పేటీఎం పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. రూ.18,300 కోట్లను సమీకరించింది. ఇందులో రూ.8,300 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా, రూ.10,000 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పద్ధతిలో సేకరించింది. నవంబరు 18న ఎన్ఎస్ఈలో రూ.రూ.1,950 వద్ద, బీఎస్ఈలో రూ.1,955 వద్ద నమోదైంది. అదే రోజున రూ.1,560 కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు షేరు సుమారు 77 శాతం నష్టపోవడం గమనార్హం.
ప్రారంభంలోనూ ఇబ్బందులు: పేటీఎంను (Paytm) 2009లో విజయ్ శేఖర్ శర్మ ప్రారంభించారు. ఆదిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ అంకుర సంస్థను నడిపారు. అలీబాబా గ్రూప్నకు చెందిన జాక్మా, సాఫ్ట్బ్యాంక్ నుంచి పెట్టుబడులు సేకరించి వార్తల్లోకెక్కారు. 2016లో ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడంతో అది పేటీఎంకు బాగా కలిసొచ్చింది. ఎక్కువ మంది డిజిటల్ చెల్లింపులకు మారి, పేటీఎంను అధికంగా వినియోగించారు. దీంతో దేశంలోని 100 మంది ధనికుల క్లబ్లో కూడా విజయ్ చేరారు. గూగుల్ వంటి కంపెనీలు చిన్న అంకుర సంస్థలను దెబ్బ తీసేలా కార్యకలాపాలు సాగిస్తున్నాయని బహిరంగంగా విమర్శించడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో విజయ్కు 51 శాతం ఉండగా, మిగతాది ఒన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఆధీనంలో ఉంది.
తాజాగా ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో విజయ్ ఎక్స్లో స్పందించారు. ‘ప్రతి సవాలుకు ఒక పరిష్కారం ఉంటుంది. దేశానికి సేవ చేసేందుకు మేము ఎప్పుడూ విధేయత కలిగి ఉంటామ’ని పోస్ట్ చేశారు.
ఇవీ ఆరోపణలు..
- పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనీ లాండరింగ్ ఆరోపణలు, కేవైసీ ఉల్లంఘనలు ఇందుకు నేపథ్యమని తెలుస్తోంది. పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ బ్యాంక్ మధ్య కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు సమాచారం. అవసరమనుకుంటే ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగే అవకాశమూ ఉంది.
- పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు సంబంధించి కేవైసీ చేయని లక్షలాది ఖాతాలను గుర్తించారట. ఒకే పాన్తో వేలాది ఖాతాలు తెరిచిన ఉదంతాలు వెలుగు చూశాయని సమాచారం. కేవైసీ చేసిన ఖాతాలకు నిర్దేశించిన గరిష్ఠ పరిమితిని మించి కొన్నిసార్లు ఆయా ఖాతాల్లో లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు 35 కోట్ల ఇ-వాలెట్లు ఉండగా, అందులో 31 కోట్ల ఖాతాలు నిద్రాణ స్థితిలో ఉన్నాయి. మిగిలిన 4 కోట్ల ఖాతాలు కూడా జీరో బ్యాలెన్స్, స్వల్ప మొత్తాలను కలిగి ఉన్నాయి. నిద్రాణ స్థితితో ఉన్న ఖాతాలను మనీలాండరింగ్ కోసం వినియోగించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలకు అన్ని కంపెనీలూ ఒకటే
ప్రతి సంస్థను నియంత్రించేందుకు ఆ రంగంలో సంబంధింత నియంత్రణ సంస్థ ఉంటుంది. ఆర్థిక రంగంలోని పేటీఎంలో (Paytm) నిబంధనలు ఉల్లంఘించారని ఆర్బీఐ చర్యలకు తీసుకోవడం సబబే. ఫిన్టెక్ కంపెనీగా కొనసాగుతున్న పీపీబీఎల్ నియంత్రణ సంస్థ పర్యవేక్షణ నుంచి తప్పించుకోలేదు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
పేటీఎం వినియోగదారులకు సేవలందించేందుకు సిద్ధం..
మార్చి 1 నుంచి దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు ఆర్బీఐ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో పేటీఎం (Paytm) వినియోగదార్లకు సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేస్తే, పేటీఎంను కాపాడేందుకు మేం నేరుగా వెళ్లే ప్రణాళిక ఏదీ లేదు. ఆర్బీఐ గనుక మాకు మార్గదర్శకాలు జారీ చేసి, ఏదైనా ప్రభావం ఉంటే మేము అక్కడ ఉంటాం.
ఎస్బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి