Moto G64: ₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్‌.. జీ64 ఫీచర్లు ఇవీ..

మోటో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది.

Updated : 16 Apr 2024 14:05 IST

Moto G64 5G | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మోటోరొలా (Motorola) కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గతంలో తీసుకొచ్చిన జీ62 స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా జీ64 5జీని (Moto G64) లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్‌ 14, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ వస్తోంది. పూర్తి వివరాలు ఇవీ..

మోటో 64 5జీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.16,999గా పేర్కొంది. ఇవి కేవలం పరిచయ ధరలని కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో రేట్లను సవరించే అవకాశం ఉంది. ఐస్‌ లైలాక్‌, మింట్‌ గ్రీన్‌, పెర్ల్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. మోటోరొలా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్, రిటైల్‌ స్టోర్లలో ఈ మొబైల్‌ను ఏప్రిల్‌ 23 నుంచి కొనుగోలు చేయొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌/ డెబిట్‌ కార్డులతో కొనుగోళ్లపై రూ.1000 డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఈ వన్‌ప్లస్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 తగ్గింపు!

ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14తో వస్తోంది. మరో ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌ మాత్రమే ఇస్తామని కంపెనీ చెబుతోంది. మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ లభిస్తాయి. 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌, 120Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7025 ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ సెన్సర్, ముందు వైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 5జీ, బ్లూటూత్‌ 5.3, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌తో వస్తోంది. ఇందులో 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని