Meta : మెటా బ్లూ టిక్ కావాలా.. ఇలా చేయండి!
ట్విటర్ తరహాలో చెల్లింపు బ్లూ టిక్ ఫీచర్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా అందుబాటులోకి తీసుకొచ్చింది. దాన్ని పొందాలంటే ఇలా చేయండి.
ఇంటర్నెట్ డెస్క్ : ట్విటర్ (Twitter) సీఈవోగా ఎలాన్ మస్క్ (Elon Musk) బాధ్యతలు చేపట్టిన తర్వాత వెరిఫైడ్ ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్ (Blue Tick Verification)ను సాధారణ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. నెలవారీ రుసుము చెల్లించి యూజర్లు తమ ఖాతాకు బ్లూ టిక్ వెరిఫికేషన్ పొందొచ్చు. తాజాగా ఇదే విధానాన్ని మరో సోషల్ మీడియా (Social Media) దిగ్గజం మెటా (Meta) ఈ నెల 7 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. మెటాకు చెందిన ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్లో (Instagram) బ్లూ టిక్ పొందాలంటే ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లు నెలకు రూ. 699 చెల్లించాలి. రాబోయే రోజుల్లో నెలకు రూ.599కే వెబ్ బేస్డ్ సబ్స్క్రిప్షన్ తెచ్చే ఆలోచనలో మెటా ఉంది. ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా సమర్పించి యూజర్లు బ్లూటిక్ పొందవచ్చు. దీంతో ఖాతాకు రక్షణ ఉండటంతోపాటు, కొన్ని రకాల ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయని మెటా చెబుతోంది.
ఎలా పొందాలంటే..
- తొలుత మీ ఫోన్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాప్లను ఓపెన్ చేయాలి.
- ఏ ప్రొఫైల్కు బ్లూ టిక్ కావాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోవాలి.
- ఆ తరువాత సెట్టింగ్స్లోని ‘అకౌంట్ సెంటర్’ను సెలక్ట్ చేయాలి.
- అక్కడ మెటా వెరిఫైడ్ ఐచ్ఛికం కన్పిస్తుంది. ఒక వేళ కనిపించని పక్షంలో యాప్ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
- వైరిఫైడ్ ఐచ్ఛికం ఎంచుకొని పేమెంట్ చెల్లించాలి.
- మెటా సూచనలన్నీ చదివిన తరువాత ప్రభుత్వ గుర్తింపు కార్డును వెరిఫికేషన్ కోసం ఇవ్వాలి.
- ఆ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే మీకు బ్లూ టిక్ వచ్చేస్తుంది.
ఎవరికి ఇస్తారంటే..
భారత దేశంలో పుట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ బ్లూ టిక్ ఇస్తామని మెటా ఒక ప్రకటనలో తెలిపింది. ఇలా ఇచ్చే ముందు ఆ యూజర్ మునుపటి పోస్టుల గురించి కూడా తనిఖీ చేస్తామని వెల్లడించింది. అంతేకాకుండా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టింది. వాటిలోని పేరు, ఫొటో... ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలోని వివరాలతో సరిపోలితేనే బ్లూ టిక్ వస్తుంది.
గతంలో ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్ను వార్తా సంస్థలు, సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్షర్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఖాతాలకు మాత్రమే ఇచ్చేవారు. ఇందుకోసం వారు సోషల్ మీడియా సంస్థలకు కొన్ని వివరాలు సమర్పించేవారు. వాటి ఆధారంగా ఖాతాలకు బ్లూ టిక్ వెరిఫికేషన్ ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ నిబంధనను సడలించారు. నెలవారీ రుసుము చెల్లించి ఎవరైనా బ్లూ టిక్ పొందొచ్చు. మెటా బ్లూ టిక్ ఫీచర్ అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే అమల్లో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది.