Retirement Plan: పదవీ విరమణ ప్రణాళిక ఎలా ఉండాలి?
ఎలాంటి ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా, తమ అభిరుచులకు తగినట్లు ప్రశాంతంగా జీవించడం కోసం ఆర్జిస్తున్న సమయంలోనే కచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలి.
ఇంటర్నెట్ డెస్క్: పదవీ విరమణ అనేది ఒక సరికొత్త ప్రయాణం. ఎన్నో ఏళ్ల ఉద్యోగ జీవితం తర్వాత విశ్రాంతంగా ఉండే సమయం. ఈ దశకు చేరుకునేసరికి ఎన్నో ఒడుదొడుకులుచ, ఒత్తిళ్లను ఎదుర్కొని, బాధ్యతలను పూర్తిచేసి ఉంటారు. పదవీ విరమణ తర్వాత అయినా ఎలాంటి ఆర్థికపరమైన ఒత్తిడీ లేకుండా తమ అభిరుచులకు తగినట్లు ప్రశాంతంగా జీవించడం అవసరం. దీనికోసం ఆర్జిస్తున్న సమయంలోనే కచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలి. ఇందులో కూడా రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి: 1. పెట్టుబడుల ప్రణాళిక. 2. విత్డ్రా ప్రణాళిక.
పెట్టుబడుల ప్రణాళిక..
త్వరగా ప్రారంభించాలి: రిటైర్మెంట్ కోసం చిన్న వయసు నుంచే పొదుపు, పెట్టుబడులు చేయడం ఎల్లప్పుడూ మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణకు చాలా సమయం ఉంటుంది. కాబట్టి చిన్న మొత్తాల్లో పెట్టుబడులు ప్రారంభించినప్పటికీ, కంపౌండింగ్ ప్రభావంతో దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చుకోగలుగుతాం. పైగా చిన్న మొత్తాల్లో డబ్బు కేటాయిస్తాం కాబట్టి ఇతర ఖర్చులు, పెట్టుబడులకు ఇబ్బంది ఉండదు. అలాకాకుండా రిటైర్మెంట్ దగ్గరలో ఉండగా పెట్టుబడులు ప్రారంభిస్తే ఎక్కువ మొత్తంలో డబ్బు కేటాయించాల్సి వస్తుంది. ఇది ఆర్థికంగా భారమే అవుతుంది.
ద్రవ్యోల్బణం: పదవీ విరమణ కోసం పెట్టుబడులు ప్రారంభించేటప్పుడు చాలా మందికి ఎంత నిధి ఏర్పాటు చేసుకోవాలి అనేదానిపై స్పష్టత ఉండదు. ప్రస్తుత నెలవారీ ఖర్చుల ఆధారంగా అంచనా వేస్తుంటారు. కానీ, ఈ మొత్తం ఆ సమయానికి ఏ మాత్రం సరిపోకపోవచ్చు. జీవన శైలి ప్రమాణాలు మెరుగుపడడం, ద్రవోల్బణం ఇందుకు కారణాలు కావచ్చు. అందువల్ల భవిష్యత్తు అవసరాలకు కావాల్సిన మొత్తాన్ని అంచనా వేసేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇందుకోసం గత సంవత్సరాల్లో నమోదయిన రేటును ఉపయోగించవచ్చు. భారత్లో ఈ సంవత్సరం ద్రవ్యోల్బణం రేటు దాదాపు 7 శాతం వరకు ఉంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు దీన్ని పరిగణనలోకి తీసుకుని.. పదవీ విరమణ సమయం దగ్గరపడేకొద్దీ కావాల్సిన నిధిపై స్పష్టత వస్తుంది కాబట్టి దానికి తగినట్లుగా సవరణలు చేసుకోవచ్చు.
రాబడి: మీరు ఎంచుకున్న పెట్టుబడి సాధనాలు ద్రవ్యోల్బణంతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ రాబడి ఇచ్చేలా ఉండాలి. లేదంటే పెట్టుబడుల వల్ల ప్రయోజనం ఉండదు. ద్రవ్యోల్బణాన్ని మించి కనీసం 1-2 శాతం రాబడి ఉండేలా చూసుకోవడం మంచిది.
విత్డ్రా ప్రణాళిక ..
పెట్టుబడుల అంతిమ లక్ష్యం పదవీ విరమణ తర్వాత సాధారణ జీవితం గడిపేలా నిధులను సమకూర్చుకోవడం. అందువల్ల ఏ రేటు వద్ద నిధులను విత్డ్రా చేసుకోవాలో నిర్ణయించుకోవం కూడా సవాలే. ముందుగా పదవీ విరమణ సమయానికి ఉన్న జీవన శైలిని అనుసరించి ఖర్చులు, పదవీ విరమణ జీవిత కాలాన్ని అంచనా వేసి విత్డ్రా ప్రణాళిక రూపొందించుకోవాలి.
నేరుగా ఆదాయ అవసరాలకు ఉపసంహరించుకునేవారు 4% నియమాన్ని అనుసరించవచ్చు. పదవీ విరమణ పొందిన వారు ప్రతి సంవత్సరం తమ పదవీ విరమణ నిధుల నుంచి 4% మొత్తాన్ని ఉపసంహరించుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ సంవత్సరాల్లో తగిన ఖాతా బ్యాలెన్స్ను కొనసాగిస్తూ స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని కొనసాగించడం ఈ నియమం ఉద్దేశం. రిటైర్మెంట్ కార్పస్ నుంచి సమర్థంగా నిధులు విత్డ్రా చేసుకునేందుకు క్రమానుగత ఉపసంహరణ విధానాన్ని (SWP) కూడా ఎంచుకోవచ్చు. దీని ద్వారా ఆదాయాన్ని పొందడం మాత్రమే కాకుండా.. మిగిలిన ఫండ్ ను పెట్టుబడిగా ఉంచి, వృద్ధిని కొనసాగిస్తూ రాబడిని పొందవచ్చు.
చివరిగా: రిటైర్మెంట్ తర్వాత కూడా గౌరవప్రదమైన జీవితమే గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం ఉద్యోగం చేరిన కొత్తలోనే పదవీ విరమణను ఒక దీర్ఘకాలిక లక్ష్యంగా తమ ఆర్థిక ప్రణాళికలో చేర్చి, క్రమశిక్షణతో మదుపు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్