Tech Shame: జనరేషన్ జడ్పై ‘టెక్’ ఎఫెక్ట్.. ఇంతకీ ఏమిటీ టెక్ షేమ్?
Tech Shame: టెక్ షేమింగ్ అనే పదం ఈ మధ్య వాడుకలోకి వచ్చింది. జనరేషన్ జడ్ యువత ఉద్యోగ జీవితంలో టెక్నాలజీ వినియోగంలో ఇబ్బంది పడడాన్ని టెక్ షేమింగ్గా పేర్కొంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కంప్యూటర్లు పరిచయం అయిన కొత్తల్లో వాటి వాడకం అప్పటి తరానికి పెద్ద సవాలుగా ఉండేది. టెక్నాలజీని ఆకళింపు చేసుకుని వాటితో పనిచేయడం వారికి కత్తిమీద సాములా అనిపించేది. ఆ తర్వాత వచ్చిన వారికి మాత్రం అదేమంత పెద్ద విషయంలా అనిపించలేదు. మొదట్లో వీరెవరికీ పెద్దగా టెక్నాలజీ పరిచయం లేకపోయినప్పటికీ.. వృత్తి జీవితంలో పెద్దగా ఇబ్బందులైతే ఎదుర్కోలేదు. అదే జనరేషన్ జడ్ విషయానికొస్తే.. వీరికి టెక్నాలజీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇతరులతో పోలిస్తే.. టెక్నాలజీ విషయంలో వీరు కాస్త ముందే. కానీ ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు వీరూ ఇబ్బంది పడుతున్నారట. ఈ క్రమంలోనే టెక్షేమ్ అనే పదం కూడా పుట్టుకొచ్చింది. ఇంతకీ జనరేషన్ జడ్కు ఉన్న ఇబ్బందేంటి? టెక్ షేమ్ అంటే ఏంటి?
1995-2012 మధ్య పుట్టిన వారిని జనరేషన్ జడ్గా (Generation Z) వ్యవహరిస్తారు. వీరు ఇప్పుడిప్పుడే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. చిన్నతనం నుంచి మొబైల్ ఫోన్లు, ట్యాబ్, ల్యాప్టాప్లు వంటి టెక్నాలజీని వినియోగించడంలో ముందు వరుసలో ఉండేవారే. వృత్తి జీవితం వచ్చేసరికి వీరు పాత తరం కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫ్యాక్స్ మెషీన్ల వాడకం విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారట. వృత్తిపరమైన డిజిటల్ సాధనాలను వినియోగించలేకపోతున్నారట. 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి వృత్తి జీవితంలోకి అడుగుపెట్టిన వాళ్లలో దాదాపు సగం మంది ఇలా సాంకేతికంగా ఇబ్బంది పడ్డారని లాసల్లే ఏజెన్సీ అనే సంస్థ తన సర్వేలో పేర్కొంది.
వీధి కుక్కల దాడిలో గాయపడి వ్యాపారవేత్త పరాగ్ దేశాయ్ కన్నుమూత!
మరి టెక్ షేమ్ అంటే?
కంప్యూటర్లు తయారుచేసే హెచ్పీ కంపెనీ.. తొలుత టెక్ షేమ్ అనే పదాన్ని వినియోగించింది. వృత్తి జీవితంలో సాధనాలను వినియోగించే విషయంలో యువకులు ఇబ్బందికి గురవుతున్నారని నిర్వచించడానికి ఈ పదాన్ని ప్రయోగించింది. ప్రతి ఐదుగురిలో ఒకరు టెక్నాలజీ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్న హెచ్పీ తెలిపింది. వృత్తి జీవితంలో ఇలా టెక్నాలజీని వాడలేకపోవడాన్ని సదరు వ్యక్తులు అసమర్థతగా భావిస్తారట. పైగా తోటి వారిని అడగడానికి మొహమాట పడతారని, ఒకవేళ వారు ఏదైనా అంటే అవమానంగా భావించడాన్ని టెక్షేమ్గా పేర్కొంటారు.
చూడ్డానికి ఈ సమస్య చిన్నగా కనిపించిన్పటికీ.. టెక్ షేమింగ్ను జనరేషన్ జడ్ యువత తమ ఆత్మగౌరవానికి భంగం కలిగిందని భావించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. పైగా వ్యక్తులు ఒంటరితనానికి లోనయ్యే ప్రమాదమూ ఉందని చెప్తున్నారు. సాధారణంగా టెక్షేమింగ్ అనేది అన్ని వయసుల వారికీ చెందిందే అయినప్పటికీ.. జనరేషన్ జడ్ ఉద్యోగులపై దీని ప్రభావం ఎక్కువ అని చెప్తున్నారు. దీన్ని నివారించాలంటే మేనేజర్ స్థాయి వ్యక్తులు కొత్తగా ఉద్యోగంలో చేరే వ్యక్తులపై దృష్టి సారించాలి. సర్వేలు, ఇంటర్వ్యూల ద్వారా టెక్షేమింగ్ గురించి తెలుసుకుని జనరేషన్ గ్యాప్ను పూడ్చేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?