Investments: ఈ దీపావళి వేళ మన పెట్టుబడులు వెలగాలంటే..
ఇంట్లో చీకట్లు దూరమైనట్లు.. మన ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి సిరులు నిండాలని అందరూ కోరుకుంటారు. ఆలోచనలు ఉన్నంత మాత్రాన సరిపోదు. వాటిని ఆచరణలో పెట్టినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు వీలవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: వెలుగుల పండుగ దీపావళి (Diwali)ని ఆనందంగా నిర్వహించుకునేందుకు అందరూ సిద్ధమయ్యారు. జీవితంలో చీకట్లని పారదోలి.. వెలుగు నింపాలని అందరూ ఈరోజు ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. అలాగే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి.. ఏడాదంతా సిరిసంపదలు కురవాలని కోరుకుంటారు. మరి అలా అనుకుంటే సరిపోతుందా? అందుకు అనుగుణంగా మన పెట్టుబడుల (Investments) ప్రణాళిక ఉండాలి. అందుకే ఇప్పటి వరకు మనం చేసిన మదుపు ఎలాంటి రాబడినిచ్చింది? వాటిలో ఏమైనా మార్పులు చేయాలా? వంటి అంశాలను సమీక్షించుకోవడానికి ఈ శుభసమయం ఓ మంచి సందర్భం. ఈ ప్రక్రియలో ఉపయోగపడే కొన్ని సూత్రాలను పరిశీలిద్దాం..
50-50 రూల్..
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం స్థూల ఆర్థిక పరిస్థితులు చాలా అనిశ్చితిగా ఉన్నాయి. గతకొంత కాలంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో చలిస్తున్నాయి. ఈ తరుణంలో దేంట్లో పెట్టుబడులు పెట్టాలనే విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. ఇలాంటి సమయాల్లో 50 శాతం నగదును ఎప్పుడూ చేతిలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఉన్న డబ్బంతా ఎక్కడో ఒక చోట పెట్టుబడిగా పెడితే.. తర్వాత పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే పెద్ద ఎత్తున నష్టపోవాల్సి రావొచ్చు. అందుకే ఉన్న దాంట్లో సగం చేతిలో ఉంచుకుంటే పరిస్థితులు చక్కబడుతున్న సంకేతాలు వెలువడుతుండగానే మదుపు చేసేందుకు అవకాశం ఉంటుందన్నది ఆర్థిక నిపుణుల సలహా. అలాగే మిగిలిన సగాన్ని మ్యూచువల్ ఫండ్లు.. కొంచెం నష్టభయాన్ని భరించగలిగే స్తోమత ఉంటే స్టాక్ మార్కెట్లో మదుపు చేయొచ్చని సూచిస్తున్నారు. అయితే, అన్ని అంశాల్ని అంచనా వేసి మార్కెట్పై కాస్తోకూస్తో అవగాహన ఉంటేనే వీటిలో పెట్టుబడి పెట్టాలంటున్నారు. లేదంటే ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీరేట్లు పెరుగుతున్న నేపథ్యంలో అలాంటి సురక్షిత మార్గాలనూ పరిశీలించొచ్చని సూచిస్తున్నారు.
ఈక్విటీల్లో అయితే.. 80-20 రూల్
మార్కెట్పై మంచి అవగాహన ఉండి.. ఎలాగైనా అక్కడే సంపద సృష్టించుకోవాలనుకునే మదుపర్లకు ఆర్థిక నిపుణులు 80-20 రూల్ పాటించాలని సూచిస్తున్నారు. మొత్తం పెట్టుబడిలో 80 శాతం మ్యూచువల్ ఫండ్లలో పెట్టాలని చెబుతున్నారు. అదీ ఇండెక్స్, లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్ కేటగిరీలను ఎంచుకోవాలంటున్నారు. మిగిలిన 20 శాతం నిధుల్ని నేరుగా స్టాక్స్లో మదుపు చేయాలని సలహా ఇస్తున్నారు. అదీ కంపెనీల ఫండమెంటల్స్ క్షుణ్నంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు.
10 పర్సెంట్ గోల్డెన్ రూల్..
మొత్తం పెట్టుబడుల్లో దాదాపు 5-10 శాతం బంగారానికి కేటాయించడం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆర్థికమాంద్యం లేదా ఇతర సంక్షోభ సమయాల్లో రక్షిస్తుందని చెబుతున్నారు. మాంద్యం తప్పదన్న విశ్లేషణలు బలపడుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాంటప్పుడు చాలా మంది సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారంలోకి పెట్టుబడుల్ని మళ్లిస్తారు. అప్పుడు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
అత్యవసరానికి సిద్ధంగా..
ప్రమాదం, అత్యవసరం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు తట్టుకునే విధంగా అత్యవసర నిధిని అందుబాటులో ఉంచుకోవాలి. కనీసం ఆరు నెలల ఖర్చులు, ఈఎంఐలకు సరిపడా మొత్తం ఈ నిధి రూపంలో ఉంచుకోవడం మేలు. దీన్ని పక్కన పెట్టిన తర్వాతే పెట్టుబడులపై ఆలోచించాలి.
(గమనిక: స్టాక్ మార్కెట్ లేదా దానితో సంబంధం ఉన్న మార్గాల్లో పెట్టుబడి పెట్టడం నష్టభయంతో కూడుకొన్న అంశం. వాటిలో మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత వ్యవహారం. పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.