హీరో ఎక్స్‌పల్స్‌ 200 4వీ ర్యాలీ ఎడిషన్‌

హీరో మోటోకార్ప్‌ 200సీసీ బైక్‌ ఎక్స్‌పల్స్‌ 200 4వీలో ర్యాలీ ఎడిషన్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1.52 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. అధునాతన సస్పెన్షన్‌ సెట్‌-అప్‌, మెరుగైన గ్రౌండ్‌ క్లియరెన్స్‌, ర్యాలీ గ్రాఫిక్స్‌ ఈ బైక్‌లో చేర్చినట్లు కంపెనీ తెలిపింది. ఈనెల

Updated : 19 Jul 2022 08:50 IST

ధర రూ.1.52 లక్షలు

దిల్లీ: హీరో మోటోకార్ప్‌ 200సీసీ బైక్‌ ఎక్స్‌పల్స్‌ 200 4వీలో ర్యాలీ ఎడిషన్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1.52 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. అధునాతన సస్పెన్షన్‌ సెట్‌-అప్‌, మెరుగైన గ్రౌండ్‌ క్లియరెన్స్‌, ర్యాలీ గ్రాఫిక్స్‌ ఈ బైక్‌లో చేర్చినట్లు కంపెనీ తెలిపింది. ఈనెల 22 నుంచి 29 వరకు కంపెనీ ఆన్‌లైన్‌ అమ్మకాల ప్లాట్‌ఫామ్‌ ఇషాప్‌లో ముందస్తుగా బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. ఫ్యాక్టరీలో అమర్చిన ర్యాలీ కిట్‌తో మంచి పనితీరు అందిస్తుందని కంపెనీ హెడ్‌ (స్ట్రాటజీ, గ్లోబల్‌ ప్రోడక్ట్‌ ప్లానింగ్‌) మలో లీ మాసన్‌ పేర్కొన్నారు. ఇందులో అమర్చిన 200 సీసీ ఆయిల్‌-కూల్డ్‌ ఇంజిన్‌ గరిష్ఠంగా 18.9 బీహెచ్‌పీ శక్తిని అందిస్తుంది. 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని