Hero Electric: హీరో ఎలక్ట్రిక్ నుంచి 3 విద్యుత్ స్కూటర్లు.. ₹85వేల నుంచి మొదలు
Hero Electric: హీరో ఎలక్ట్రిక్ మూడు కొత్త స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. విద్యుత్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా రాబోయే రెండు మూడేళ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షలకు పెంచాలని ఆ కంపెనీ నిర్ణయించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ (Hero Electric) కొత్త విద్యుత్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆప్టిమా సీఎక్స్ 5.0 (Optima CX5.0) (డ్యూయల్ బ్యాటరీ), ఆప్టిమా సీఎక్స్ 2.0 (Optima CX5.0) (సింగిల్ బ్యాటరీ), ఎన్వైఎక్స్ (NYX) (డ్యూయల్ బ్యాటరీ) స్కూటర్లను ఆ కంపెనీ తీసుకొచ్చింది. ఈ స్కూటర్ల ధరలు రూ.85వేల (ఎక్స్షోరూమ్) నుంచి ప్రారంభమై రూ.1.30 లక్షలుగా ఉన్నాయి.
Optima CX2.0 మోడల్ 2kWh బ్యాటరీతో వస్తుంది. సింగిల్ ఛార్జ్తో 89 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది. గరిష్ఠంగా 48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. నాలుగున్నర గంటల్లో బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. Optima CX5.0 మోడల్ 3kWh బ్యాటరీతో వస్తుంది. సింగిల్ ఛార్జ్తో 113 కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఈ బైక్ టాప్స్పీడ్ 55 Kmph. NYX మోడల్లో సైతం CX5.0 వినియోగించిన బ్యాటరీనే వాడారు. ఈ మోడల్ టాప్ స్పీడ్ 48 kmph. సింగిల్ ఛార్జ్తో 113 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ఈ మూడు స్కూటర్లు రెండేసి రంగుల్లో లభ్యమవుతున్నాయి. అన్ని డీలర్షిప్ల వద్ద ఈ స్కూటర్లు లభ్యం కానున్నాయి.
10 లక్షల వాహనాలు టార్గెట్
రాబోయే 2-3 ఏళ్లలో ఏటా 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయబోతున్నట్లు హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తోంది. అందులో భాగంగానే రాజస్థాన్లో దాదాపు రూ.1,200 కోట్ల పెట్టుబడితో 20 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని చూస్తోంది. తద్వారా తమ తయారీ యూనిట్ల నుంచి రాబోయే రెండు మూడేళ్లలో ఏడాదికి 10 లక్షల వాహనాలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ కంపెనీకి చెందిన లక్ష వాహనాల విక్రయాలు జరుగుతాయని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అవి 2.5 లక్షలకు చేరుతాయన్నారు. ప్రస్తుతం భారతదేశంలో విద్యుత్ ద్విచక్రవాహనాల డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. హీరో ఎలక్ట్రిక్ కూడా ఆ దశగా ముందడుగు వేస్తోందన్నారు. ప్రస్తుతం తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు లుథియానాలో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య