బ్రేకింగ్

breaking
29 Mar 2024 | 12:23 IST

కేసీఆర్‌ చేసిన మొదటి తప్పు అదే: కోమటిరెడ్డి

హైదరాబాద్‌: కేసీఆర్‌ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్‌ చేసిన మొదటి తప్పు. ఆయన చేసిన పాపాల వల్ల కరవు వచ్చింది. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారు. యాదగిరి గుట్టలో స్కామ్‌ జరిగింది.. ఎన్నికల తర్వాత విచారణ చేస్తాం. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగా మారుస్తాం. గేట్లు తెరవకముందే కాంగ్రెస్‌లోకి తోసుకుని వస్తున్నారు.’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు