బ్రేకింగ్

breaking
07 May 2024 | 08:15 IST

అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: మోదీ

అహ్మదాబాద్‌: ఎన్నికల వేళ ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలన్నారు. మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆయన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓటు వేసిన అనంతరం మాట్లాడారు. ‘‘అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎండల్లోనూ ప్రజలు తరలివచ్చి ఓటు వేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉంది. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలి’’ అని ప్రధాని మోదీ తెలిపారు. 

మరిన్ని

తాజా వార్తలు