7 కంపెనీలు ₹3900 కోట్లు.. వచ్చేవారం IPOల క్యూ!
IPO Queue: వచ్చేవారం ఐపీఓలు క్యూ కడుతున్నాయి. ఏడు మెయిన్ బోర్డు సహా 11 ఐపీఓలు మార్కెట్లో నిధులు సమీకరించనున్నాయి. ఆ వివరాలు ఇవీ..
IPO news | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఐపీఓల (IPO) సీజన్ నడుస్తోంది. టాటా టెక్, ఫ్లెయిర్, గాంధార్ ఆయిల్ వంటి ఐపీఓలు ఇటీవల కాలంలో సూపర్హిట్ కొట్టిన వేళ మరిన్ని కంపెనీలు నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. వచ్చే వారం ఏకంగా 11 కంపెనీలు ఐపీఓకు సిద్ధమయ్యాయి. ఇందులో ముత్తూట్ మైక్రోఫిన్, మోతీసన్స్ జువెలర్స్, హ్యాపీ ఫోర్జింగ్స్ వంటి ఏడు మెయిన్బోర్డ్ ఐపీఓలు కాగా.. ఎస్ఎంఈ సెగ్మెంట్లో మరో నాలుగు కంపెనీలు నిధులు సమీకరించనున్నాయి.
ముత్తూట్ మైక్రోఫిన్
ముత్తూట్ పప్పాచాన్ గ్రూప్నకు చెందిన మైక్రో రుణ సంస్థ ముత్తూట్ మైక్రోఫిన్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ డిసెంబర్ 18న ప్రారంభమై 20న ముగియనుంది. రూ.960 కోట్లు నిధులు సమీకరించేందుకు ఐపీఓకు వస్తున్న ఈ సంస్థ ఒక్కో షేర్ల ధరల శ్రేణిని రూ.277-291గా నిర్ణయించింది. ఇందులో రూ.760 కోట్లను ప్రైమరీ షేర్ల విక్రయం ద్వారా.. మిగిలిన రూ.200 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన విక్రయించనున్నారు. ఐపీఓలో విక్రయిస్తున్న షేర్లను క్యూఐబీలకు 55 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం చొప్పున కేటాయించారు. రిటైల్ మదుపరులు కనీసం 51 షేర్లకు (1 లాట్) బిడ్లు దాఖలు చేయాలి. కనీసం రూ.14,841 చొప్పున పెట్టుబడి పెట్టాలి.
హ్యాపీ ఫోర్జింగ్స్
ఆటోమొబైల్ రంగంలో విడిభాగాల తయారు చేసే హ్యాపీ ఫోర్జింగ్స్ లిమిటెడ్ ఐపీఓ డిసెంబర్ 19న ప్రారంభమై 21న ముగియనుంది. రూ.1008 కోట్లు సమీకరించే ఉద్దేశంతో ఐపీఓకు వస్తున్న ఈ కంపెనీ ఒక్కోషేరు ధరల శ్రేణిని రూ.808-850గా నిర్ణయించింది. ఐపీఓలో భాగంగా రూ.400 కోట్లు విలువైన షేర్లను ఫ్రెష్గా ఇష్యూ చేయనున్నారు. 71.6 లక్షల షేర్లు ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. క్యూఐబీలకు 50 శాతం షేర్లు కేటాయించారు. 35 శాతం షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం ఎన్ఐఐకు కేటాయించారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 17 ఈక్విటీ షేర్లు (లాట్) కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
18 నుంచి గోల్డ్ బాండ్ సబ్స్క్రిప్షన్.. గ్రాము ధరెంత? ఎలా కొనాలి?
ముఫ్తీ జీన్స్ ఐపీఓ
ముఫ్తీ జీన్స్ తయారీ సంస్థ క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ లిమిటెడ్ ఐపీఓ డిసెంబర్ 19న ప్రారంభమై 21న ముగియనుంది. రూ.550 కోట్ల ఐపీఓలో భాగంగా ధరల శ్రేణిని రూ.266-280గా కంపెనీ నిర్ణయించింది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు (లాట్) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్
ముంబయికి చెందినన రియల్ ఎస్టేట్ సంస్థ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఐపీఓ డిసెంబర్ 18న ప్రారంభమై 20న ముగియనుంది. రూ.400 కోట్ల ఈ ఐపీఓలో ఫ్రెష్ షేర్లను జారీ చేయనున్నారు. ధరల శ్రేణి రూ.340-360గా నిర్ణయించారు.
మోతీసన్స్ ఐపీఓ
జైపుర్కు చెందిన రిటైల్ ఆభరణాల కంపెనీ మోతీసన్స్ జువెలర్స్ ఐపీఓ డిసెంబర్ 18న ప్రారంభమై 20న ముగియనుంది. ఐపీఓలో షేరు ధరల శ్రేణిని రూ.52-55గా నిర్ణయించారు. 2.74 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేస్తున్నారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.151 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్లు కనీసం 250 ఈక్విటీ షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన కనీసం రూ.13,750 పెట్టుబడిగా పెట్టాలి.
ఆర్బీజడ్ జువెలర్స్
రూ.100 కోట్ల నిధులు సమీకరించేందుకు ఐపీఓకు వస్తున్న ఆర్బీజడ్ డిసెంబర్ 19న ప్రారంభమై 21న ముగియనుంది. ధరల శ్రేని 90-100గా నిర్ణయించారు. ఫ్రెష్ షేర్లను జారీ చేయనున్నారు.
ఆజాద్ ఇంజినీరింగ్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంజినీరింగ్, ఏరోస్పేస్ విడిభాగాల తయారీ సంస్థ అజాద్ ఇంజినీరింగ్ తొలి పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 20న ప్రారంభమై 22 ముగియనుంది. రూ.740 కోట్ల ఐపీఓలో రూ.500 కోట్లు ఆఫర్ ఫర్ సేల్, రూ.240 కోట్ల విలువైన షేర్లను ఫ్రెష్గా జారీ చేయనున్నారు.
ఇవి కాకుండా ఎస్ఎంఈ సెగ్మెంట్లో సహారా మారిటైమ్ ఐపీఓ డిసెంబర్ 18న ప్రారంభం కానుంది. రూ.7 కోట్లు సమీకరించనుంది. రూ.80 కోట్లతో ఎలక్ట్రోఫోర్స్, రూ.31.25 కోట్లు సమీకరించేందుకు శాంతి స్పిన్టెక్స్ సంస్థలు డిసెంబర్ 19న ఐపీఓకు వస్తున్నాయి. డిసెంబర్ 21న ట్రిడెంట్ టెక్ల్యాబ్స్ ఐపీఓ ద్వారా రూ.16 కోట్లు సమీకరించనుంది. వచ్చే ఏడాది ఐపీఓకు వచ్చేందుకు 65 సంస్థలు ఐపీఓకు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో కొన్నింటికి సెబీ అనుమతులు లభించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా తన బ్యాగేజీ పాలసీని మార్చింది. కొత్త రూల్స్ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
మొబైల్లో వచ్చిన మెసేజ్ను హెడ్డర్ సాయంతో ఎవరు పంపారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..? -
కౌంటర్కు వెళ్లకుండానే ట్రైన్ టికెట్.. UTS యాప్తో బుకింగ్ ఎలా..?
UTS app: టికెట్ కొనుగోలును సులభతరం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అందులో టికెట్ బుకింగ్ ఎలానో ఇప్పుడు చూద్దాం.. -
ఆధార్ కార్డ్లో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఏమేం కావాలి?
Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీలో తప్పుందా? మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఎలా అప్డేట్ చేసుకోవాలో చూడండి.. -
పెట్టుబడి ప్రభుత్వ బాండ్లలో
చిన్న మదుపరులు ప్రభుత్వ బాండ్లలో మదుపు చేసేందుకు 2021లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ను తీసుకొచ్చింది. దీన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ బాండ్ల గురించి తెలుసుకుందాం. -
టెక్నాలజీ కంపెనీల్లో
బంధన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా బంధన్ ఇన్నోవేషన్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా టెక్నాలజీ, ఫార్మా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సత్వర వృద్ధి సాధించటానికి ప్రయత్నించే కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం. -
ఆధార్ ఏటీఎం.. ఇంటి నుంచే క్యాష్ విత్డ్రా ఎలా చేసుకోవాలి?
Aadhaar ATM: ఇంటి నుంచే డబ్బు విత్డ్రా చేసుకొనే సదుపాయాన్ని పోస్టల్ శాఖ అందిస్తోంది. దీన్ని ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం.. -
వేసవిలో ఊటీ అందాలు చూసొస్తారా? ₹13 వేల నుంచే ప్యాకేజీ ధరలు
IRCTC tour package: వేసవిలో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే. ప్రయాణ టికెట్లు, వసతి ఏర్పాట్లతో ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాకేజీ వివరాలను ఓసారి పరిశీలించండి. -
టర్మ్ ఇన్సూరెన్స్ కుటుంబానికి భరోసానిచ్చేలా
బీమా పాలసీలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని పొదుపు చేసేందుకు ఉపయోగపడతాయి. మరికొన్ని పెట్టుబడులకు తోడ్పడతాయి. వీటికి భిన్నంగా పూర్తి రక్షణకే పరిమితమయ్యేవి టర్మ్ పాలసీలు. వీటిని ఆన్లైన్లోనూ తీసుకోవచ్చు. లేదా బీమా సలహాదారును సంప్రదించీ కొనుగోలు చేయొచ్చు. -
కేరళ ప్రకృతి అందాలు చూస్తారా? ₹14 వేల నుంచే IRCTC ప్యాకేజీ
IRCTC tour package: వేసవిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న కేరళ టూర్ ప్యాకేజీ వివరాల్ని పరిశీలించండి.. -
తిరుమల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దర్శనం, ప్రయాణ టికెట్లతో ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఇవే..
Irctc Tirupati: తిరుమల దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? రెండు రాష్ట్రాల ప్రజలు గోవిందుడిని దర్శించుకొనేందుకు ఐఆర్సీటీసీ అనేక ప్యాకేజీలు అందిస్తోంది. వాటిని ఓసారి పరిశీలించండి.. -
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
డిజీ లాకర్తో ఆధార్, పాన్ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?
DigiLocker: ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఒకేచోట డిజిటల్గా అందుబాటులో ఉంచేందుకు డిజీలాకర్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకీ ఇదెలా ఉపయోగపడుతుందో తెలుసా? -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి.
తాజా వార్తలు (Latest News)
-
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. యువ జంట వినూత్న నిర్ణయం
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు