బ్రేకింగ్

breaking
25 Apr 2024 | 10:34 IST

తమన్నాకు మహారాష్ట్ర సైబర్‌ విభాగం సమన్లు

ముంబయి: మహారాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ విభాగం ప్రముఖ సినీనటి తమన్నాకు సమన్లు జారీ చేసింది. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను అక్రమంగా ‘ఫెయిర్‌ ప్లే’ యాప్‌లో ప్రదర్శించిన కేసులో ఆమెను ప్రశ్నించేందుకు ఈ నోటీసులు ఇచ్చింది. దీంతో ‘వయాకామ్‌’ మీడియాకు రూ.కోట్ల నష్టం జరిగిందని తెలిపింది. ఈ మేరకు తమన్నాను ఈ నెల 29న విచారణకు హాజరు కావాలని మహారాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ విభాగం కోరింది.

మరిన్ని

తాజా వార్తలు