బ్రేకింగ్

breaking
07 May 2024 | 10:09 IST

వైఎస్‌ షర్మిలపై కేసు నమోదు

బద్వేలు: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై వైఎస్సార్‌ జిల్లాలోని బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు అంశాన్ని ప్రస్తావించినందుకు గాను ఆమెపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఈ అంశంపై మాట్లాడొద్దని ఇటీవల కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నెల ఒకటో తేదీన బద్వేలులో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ వివేకా హత్య ఘటనను షర్మిల ప్రస్తావించారు. ఈక్రమంలో స్థానిక ఎన్నికల నోడల్ అధికారి ఎస్వీ కృష్ణ ఆమెపై బద్వేలు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని

తాజా వార్తలు