Financial Mistakes: కొత్త ఏడాదిలో ఈ 6 తప్పులు అస్సలు చేయొద్దు..!
Financial Mistakes: ఆర్థిక విషయాల్లో మనం చేసే తప్పుల వల్ల మనపై ఆధారపడేవారు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. కొత్త ఏడాదిలో అలాంటి తప్పులు జరగకుండా చూడాలి.
ఇంటర్నెట్ డెస్క్: కొత్త ఏడాదిలో అడుగుపెట్టగానే చాలా మంది కొత్త కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. ఆరోగ్యంపట్ల శ్రద్ధ పెట్టడంలో భాగంగా పార్కులకు పరుగులు తీస్తుంటారు. కొత్త ప్రదేశాలకు వెళ్లడానికీ ప్రణాళికలు రూపొందించుకుంటారు. చాలా మంది ఇతర విషయాల మీద పెట్టే శ్రద్ధ.. ఆర్థిక విషయాల మీద పెద్దగా పెట్టరు. మిగిలిన విషయాల్లో మన నిర్ణయాలు ఎలా ఉన్నా.. ఆర్థిక విషయాల్లో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆర్థికంగా మనం చేసే పొరపాట్లు మనతో పాటు మనపై ఆధారపడే వారు సైతం ప్రభావితం అవుతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి కొత్త ఏడాదిలో ఆర్థికంగా చేయకూడని కొన్ని తప్పులను తెలుసుకుందాం. ఒకవేళ పాత ఏడాదిలో ఈ తప్పులు చేసుంటే పరిహరించేందుకు ప్రయత్నిద్దాం..
పొదుపు దేనికోసం చేస్తున్నాం?
కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు.. ఇప్పటికే ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నవారు సైతం కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. పొదుపు అనగానే చాలా మంది పన్ను ప్రయోజనాలు పొందే మార్గాల కోసమే అన్వేషిస్తుంటారు. లేదంటే ఎక్కువ రిటర్నులు ఆశించి పెట్టుబడులు పెడుతుంటారు. ఆర్థిక విషయాల్లో తెలివైన వారైతే ఈ పొరపాట్లు చేయరు. ఆదాయపు పన్ను మినహాయింపులు పొందడం కోసం కొంత వరకు బీమా, ఇతర పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టడం మంచిదే అయినప్పటికీ.. మన పెట్టుబడులకు ఒక లక్ష్యం ఉంటే అది ఫలప్రదం అవుతుంది. లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు ఒకరకమైన సంతృప్తి కలుగుతుంది. కాబట్టి ఏడాది ప్రారంభంలోనే మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. అదీ సాధించగలిగే లక్ష్యమై ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
బీమా విషయంలో ఆ తప్పులొద్దు
జీవిత బీమా పట్ల ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి తరానికి అవగాహన పెరిగిన మాట వాస్తవం. అయితే, ఇప్పటికీ చాలా మంది జీవిత బీమా కోసం వెచ్చించే మొత్తం తిరిగి రావాలని కోరుకునేవారే ఉంటున్నారు. వాస్తవానికి మనపై ఆధారపడే కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు టర్మ్ బీమా పాలసీ తీసుకోవడం తెలివైన నిర్ణయం. మన వయసు, ఆదాయం, కెరీర్, కుటుంబ సభ్యుల అవసరాలు వంటివి పరిగణనలోకి తీసుకుని అందుకు తగ్గట్లుగా టర్మ్ బీమా పాలసీని తీసుకోవాలి. అలాగని తక్కువ ప్రీమియం కోసం తక్కువ మొత్తం ఎంచుకోవడమూ సరికాదు. కాబట్టి అవసరాలు, చెల్లించగలే స్తోమతను బట్టి టర్మ్ బీమా పాలసీ తీసుకోండి.
ఈ రూల్ పాటిస్తున్నారా?
‘‘ప్రస్తుతం నెలకు లక్ష వస్తోంది. వచ్చే ఏడాది ఓ 10 శాతం ఇంక్రిమెంట్. ఒకవేళ కంపెనీ మారితే 30 శాతం హైక్ అనుకుంటే నెలకు రూ.1.30 లక్షలు వేతనం వస్తుంది. ఇంకేం బిందాస్!’’.. చాలా మంది యువత ఆలోచనలు ఇలానే ఉంటున్నాయి. వచ్చే ఏడాది పెరగబోయే వేతనాన్ని కూడా అంచనా కట్టి గాల్లో మేడలు కట్టే్స్తుంటారు. జీతం పెరిగాక చూద్దాంలే అనే తీరుతో ముందుకు సాగిపోతూ పొదుపు పక్కనపెడుతుంటారు. కొవిడ్ పరిస్థితులు, ఉద్యోగ కోతలు చూశాకైనా ఈ ధోరణి మార్చుకోవాలి. ఎప్పుడూ ప్రస్తుత జీతాన్నే పరిగణనలోకి తీసుకోవాలి. ఇందులో 50-30-20 సూత్రాన్ని నిత్యం పాటించాలి. మనం సంపాదించేదాంట్లో 50 శాతం అద్దెలు, కిరాణా, బిల్లు చెల్లింపులు వంటివి అవసరాలకు వినియోగించాలి. 30 శాతం కోరికలు, సరదాలు వంటివాటికి వినియోగించొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ 20 శాతం మొత్తాన్ని పొదుపు పెట్టుబడుల కోసం వినియోగించాలన్న విషయం గుర్తుంచుకోవాలి.
అత్యవసర నిధి ఉందా?
పైన చెప్పినట్లు పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు. పైగా అవసరాలు చెప్పిరావు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కరోనా సమయంలోనూ, ఇటీవల మాంద్యం భయాల నేపథ్యంలోనూ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైనా ఎలాంటి ఇబ్బందీ లేకుండా నిత్య జీవితం ఒడుదొడుకులకు లోను కాకుండా ఉండాలంటే కనీసం 4 నుంచి 6 నెలల జీతం మన అత్యవసర నిధిలో ఉండాలి.
విలాసాలకు పోకుంటేనే దిలాసా
చాలా మందికి చిన్నప్పటి నుంచి తీరని కోరికలు ఉంటాయి. ఉద్యోగంలోకి రాగానే వచ్చే జీతంతో ఆ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. కలలను సాకారం చేసుకోవడం మంచిదే అయినా అది విలాసాలకు దారితీయకుండా ఉంటే మంచిది. ఈఎంఐలు కట్టగలిగే స్తోమత ఉన్నంత మాత్రాన విలాసాలకు పోతే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖర్చులు పరిమితితో ఉండేలా చూసుకోవడం మంచిది.
క్రెడిట్ కార్డు ఎల్లప్పుడూ మిత్రుడు కాదు!
ఇప్పుడు క్రెడిట్ కార్డు పొందడం చాలా ఈజీ. దీంతో దాదాపు అందరి వద్దా క్రెడిట్కార్డులు ఉంటున్నాయి. లిమిట్ కూడా కొందరికి లక్షల్లో ఉంటోంది. ఏదైనా అత్యవసరం అయినప్పుడు ఈ లిమిట్ అక్కరకొస్తుంది. సరిగ్గా వాడుకుంటే క్రెడిట్కార్డు ఆప్తమిత్రుడిలా పనిచేస్తుంది. ఒకవేళ ఆఫర్ల మోజు, క్యాష్బ్యాక్ల క్రేజ్లో చిక్కుకుంటే మాత్రం తడిసిమోపెడవుతుంది. ఒక్కోసారి బిల్లు చెల్లింపులు చేయడానికి అప్పు మీద అప్పు చేయాల్సి వస్తుంది. ఒకసారి అప్పుల ఊబిలో చిక్కుకుంటే బయటపడడం అంత సులువు కాదు. చాలా మంది ఈ నియంత్రణ లేకే క్రెడిట్కార్డులను రద్దు చేసుకుంటున్నారు. కాబట్టి కొత్త ఏడాదిలో క్రెడిట్కార్డుపై మీ పట్టు పెంచుకోండి. గతంలో పొరపాట్లు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్