Telegram: ఫేస్బుక్, ఇన్స్టా తరహాలో టెలిగ్రామ్ స్టోరీస్.. ఎప్పటినుంచంటే?
టెలిగ్రామ్ (Telegram) యూప్ కొత్తగా మరో ఫీచర్ను యూజర్లకు పరిచయం చేయనుంది. దీంతో యూజర్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తరహాలో తమకు నచ్చిన టెక్స్ట్, ఫొటో, వీడియోలను స్టోరీస్గా పెట్టుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: టెలిగ్రామ్ (Telegram) యాప్లో మెసేజింగ్తోపాటు ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. అలానే, యూజర్ల గోప్యత కోసం సీక్రెట్ చాట్ ఫీచర్ కూడా ఉంది. తాజాగా మరో కొత్త ఫీచర్ను యూజర్లకు పరిచయం చేయనున్నట్లు టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ తెలిపారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తరహాలో టెలిగ్రామ్లో కూడా స్టోరీస్ (Telegram Stories) ఫీచర్ను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. టెలిగ్రామ్లో స్టోరీస్ ఫీచర్ను పరిచయం చేయాలని ఎంతో కాలంగా యూజర్ల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
‘‘తొలుత టెలిగ్రామ్లో స్టోరీస్ ఫీచర్ అవసరంలేదని భావించాం. ఇప్పటికే.. టెలిగ్రామ్ మినహా అన్ని సోషల్ మీడియా యాప్లలో స్టోరీస్ను పరిచయం చేశారు. అందుకే టెలిగ్రామ్లో స్టోరీస్ వద్దని నిర్ణయించాం. కానీ, స్టోరీస్ ఫీచర్ కావాలని ఎక్కువ మంది టెలిగ్రామ్ యూజర్లు డిమాండ్ చేయడంతో మా నిర్ణయాన్ని మార్చుకున్నాం. యూజర్ల మాట వినడం వల్లనే టెలిగ్రామ్ ఆధునిక ఫీచర్లతో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంది. జులై నుంచి టెలిగ్రామ్లో స్టోరీస్ ఫీచర్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది’’ అని పావెల్ తెలిపారు.
టెలిగ్రామ్ స్టోరీస్ ఫీచర్లు
- యూజర్లు టెలిగ్రామ్ యాప్లో స్టోరీస్ను పోస్ట్ చేసిన తర్వాత.. వాటిని ఎవరెవరు చూడాలనేది నిర్ణయించుకోవచ్చు. ఇందుకోసం యూజర్లకు స్టోరీస్ సెట్టింగ్స్లో ఎవ్రీవన్ (Everyone), ఓన్లీ యువర్ కాంటాక్ట్స్ (Only Your Contacts With Exception), ఫ్యూ సెలెక్ట్డ్ కాంటాక్ట్స్ (Few Selected Contacts), లిస్ట్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్స్ (List of Close Friends) అని నాలుగు ఆప్షన్లు ఉంటాయి. యూజర్లు తమకు నచ్చిన ఆప్షన్ను ఎంచుకుంటే.. దాని ప్రకారం ఆ జాబితాలోని వారికి మాత్రమే స్టోరీస్ కనిపిస్తాయి.
- స్టోరీస్ను సులువుగా యాక్సెస్ చేసుకునేందుకు వీలుగా యాప్లో చాట్ లిస్ట్ పైభాగంలో ఇస్తున్నట్లు టెలిగ్రామ్ వెల్లడించింది. కాంటాక్ట్ లిస్ట్లోని యూజర్ ఎవరైనా కొత్తగా స్టోరీస్ను యాడ్ చేస్తే.. చాట్ లిస్ట్ పైభాగంలో కనిపిస్తుంది. యూజర్లు తమ స్టోరీస్లో ఏవైనా మార్పులు చేయాలంటే టెలిగ్రామ్ యాప్లోని ఫొటో, వీడియో ఎడిటింగ్ టూల్స్ను ఉపయోగించుకోవచ్చు.
- యూజర్లు తమ స్టోరీస్ ఎంత సమయంపాటు ఇతరులకు కనిపించాలనేది కూడా నిర్ణయించుకోవచ్చు. ఇందుకోసం 6, 12, 24, 48 గంటల టైమ్ ఆప్షన్లను ఇస్తున్నట్లు తెలిపింది. వీటితోపాటు పర్మినెంట్ డిస్ప్లే ఆప్షన్ కూడా ఉంది. దీంతో యూజర్ తనకు నచ్చిన టెక్ట్స్, ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎప్పటికీ తన టెలిగ్రామ్ ప్రొఫైల్లో కనిపించేలా స్టోరీస్ను పెట్టుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది. -
‘ఎక్స్’లో లైక్ కొట్టాలన్నా.. పోస్టు పెట్టాలన్నా చెల్లించాల్సిందే!
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.