బ్రేకింగ్

breaking
24 Apr 2024 | 18:50 IST

జగన్‌ ఒంటరిగా కాదు.. అహంకారంతో వస్తున్నాడు: చంద్రబాబు

నెల్లిమర్ల: ఎవరికీ న్యాయం చేయని జగన్‌.. ఇప్పుడు వచ్చి కోతలు కోస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఉత్తరాంధ్ర బాగు కోసమే భోగాపురం విమానాశ్రయం తెచ్చాం. మేం ఉంటే ఇప్పటికే అది పూర్తయ్యేది. ఎన్నికల్లో జగన్‌ ఒంటరిగా కాదు.. అహంకారంతో, అవినీతి డబ్బులతో వస్తున్నాడు. వైకాపాను చిత్తుగా ఓడించేవరకు వదిలిపెట్టమని శపథం చేస్తున్నా’’అని చంద్రబాబు అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు