బ్రేకింగ్

breaking
04 May 2024 | 16:37 IST

జగన్‌ మానసిక స్థితిపై ఆందోళనగా ఉంది: షర్మిల

కడప: సీఎం జగన్‌ మానసిక స్థితిపై ఆందోళనగా ఉందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వై.ఎస్‌.ఆర్‌ పేరును చేర్పించిన పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి జగన్‌ అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే ఏఏజీ పదవి ఇచ్చారని విమర్శించారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘ కేసుల నుంచి జగన్‌ బయటపడాలంటే ఛార్జ్‌షీట్‌లో వై.ఎస్‌.ఆర్‌ పేరు చేర్చాలని కుట్ర చేశారు. అలాంటి వ్యక్తి ఆయన ఆశయాలకు వారసుడా? వైఎస్‌ విషయంలోనే ఇంత దారుణానికి ఒడిగట్టిన జగన్‌ను ప్రజలు ఎలా నమ్ముతారు?’’ అని షర్మిల అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు