బ్రేకింగ్

breaking
06 May 2024 | 23:15 IST

సూర్య శతకం.. హైదరాబాద్‌పై ముంబయి విజయం

ముంబయి: ఐపీఎల్‌-2024లో ముంబయి జట్టు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి.. 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబయి బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ (102*; 51 బంతుల్లో) శతకంతో అదరగొట్టగా.. తిలక్‌ వర్మ (37*; 32 బంతుల్లో) రాణించాడు. భువనేశ్వర్‌, మార్కో, కమిన్స్‌ తలో వికెట్‌ తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. హెడ్‌ (48), కమిన్స్‌ (35) రాణించారు. పీయూష్‌ చావ్లా 3, హార్దిక్‌ 3 వికెట్లు, కంబోజ్‌ 1, బుమ్రా 1 వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు