బ్రేకింగ్

breaking
09 May 2024 | 12:49 IST

కాంగ్రెస్‌ చేసిన వాగ్దానాలను ఎన్నటికీ నెరవేర్చదు: అమిత్‌షా

భువనగిరి: రాహుల్‌ పిల్ల చేష్టల గ్యారంటీ.. మోదీ గ్యారంటీ మధ్య జరుగుతున్న ఎన్నికలివి అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘’కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకట్లేదు. కాంగ్రెస్‌ చేసిన వాగ్దానాలను ఎన్నటికీ నెరవేర్చదు. ఆ పార్టీ 70 ఏళ్లుగా అయోధ్య విషయాన్ని పక్కన పెట్టింది. కాంగ్రెస్‌, భారాస, మజ్లిస్‌ మధ్య త్రికోణ బంధం ఉంది’’ అని అమిత్‌షా విమర్శించారు.

మరిన్ని

తాజా వార్తలు