Super Apps: ఏంటీ సూపర్ యాప్స్..? వీటితో కస్టమర్లకు ఎంతమేర ఉపయోగం!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సేవలను అందించే సూపర్ యాప్లు లేవు. ఇప్పటి వరకు సూపర్ యాప్ల సేవలు ఆయా దేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి. భవిష్యత్తులో ఎక్స్ వంటి యాప్లు ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను విస్తరించే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్ (Twitter)ను సూపర్ యాప్ (Super App)గా మార్చాలనే ఉద్దేశంతోనే ఎక్స్(X)గా పేరు మార్చినట్లు ఎలాన్ మస్క్ (Elon Musk) ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా సూపర్ యాప్ అంశం చర్చనీయాంశమైంది. ఇంతకీ సూపర్ యాప్ అంటే ఏంటి? మొదటగా దీన్ని ఎవరు ప్రారంభించారు? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సూపర్ యాప్లు ఉన్నాయి? ఎక్స్ (ట్విటర్)తోపాటు ఇంకా ఏయే కంపెనీలు సూపర్ యాప్లను తీసురానున్నాయి? ఈ సూపర్ యాప్లతో యూజర్లకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో చూద్దాం.
సూపర్ యాప్ అంటే?
తొలిసారిగా 2010 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో బ్లాక్బెర్రీ(BlackBerry) వ్వవస్థాపకుడు మైక్ లజారిడిస్ (Mike Lazaridis) సూపర్ యాప్ అనే కాన్సెప్ట్ను పరిచయం చేశారు. వివిధ రకాల సర్వీస్ల కలయికగా ఈ యాప్ ఉండాలని మైక్ అప్పట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మొబైల్ యూజర్లు ప్రతి అవసరానికి ప్రత్యేకంగా ఒక యాప్ను ఉపయోగిస్తున్నారు. వాటికి భిన్నంగా.. సోషల్ మీడియా, ఆన్లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ, గేమింగ్, ఎంటర్టైన్మెంట్, బ్యాకింగ్, నగదు వ్యాలెట్లు, క్యాబ్ బుకింగ్, టికెట్ బుకింగ్ వంటి సేవలను ఒకే యాప్లో అందుబాటులోకి తీసుకొచ్చేదే.. సూపర్ యాప్.
ప్రస్తుతం చైనాలో వీచాట్ (WeChat), సింగపూర్లో గ్రాబ్ (Grab), ఇండోనేషియాలో గోజెక్ (Gojek), జపాన్లో లైన్ (LINE), దక్షిణ కొరియాలో కకావోటాక్ (KakaoTalk)లు సూపర్ యాప్లుగా యూజర్లకు సర్వీస్లను అందిస్తున్నాయి. ప్రతి సర్వీస్ కోసం ప్రత్యేకంగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకపోవడం, ఒకే చోట అన్ని రకాల సేవలు లభిస్తుండటంతో సూపర్ యాప్లకు ఆయా దేశాల్లో ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే భవిష్యత్తులో రాబోయే సూపర్ యాప్లలో విద్య, వైద్యం, వ్యాపార రంగాలకు సంబంధించిన సేవలు సైతం అందుబాటులోకి వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మొబైల్ మార్కెటింగ్పై ప్రభావమెంత?
యూజర్కు ఏం కావాలో తెలుసుకోవచ్చు: భవిష్యత్తు అంతా డేటాదే. యూజర్లను కస్టమర్లుగా మార్చుకోవడంలో ప్రతి సంస్థకు డేటా ఎంతో ముఖ్యం. యూజర్ల గురించి ఎవరి వద్ద ఎక్కువ సమాచారం ఉంటుందో.. మార్కెట్లో ఆ కంపెనీ హవానే సాగుతుంది. ఇదే ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ వ్యాపార సూత్రం. సూపర్ యాప్ల ద్వారా కంపెనీలకు యూజర్ల గురించి ఎక్కువ సమాచారం లభిస్తుంది. అంటే, యూజర్ల ఇష్టాయిష్టాలతోపాటు, ఏ సేవల కోసం యాప్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారో తెలుస్తుంది. దీంతో, ఆయా సేవలను మెరుగుపరచడంతోపాటు, యూజర్ను ఆకర్షించేందుకు ప్రకటనలు యాప్లో చూపించే అవకాశం ఉంటుంది.
భాగస్వామ్యం/ ప్రమోషన్: సూపర్ యాప్ల ద్వారా కంపెనీలు స్థానికంగా ఉండే వ్యాపారులతో భాగస్వామ్యం నెలకొల్పవచ్చు. దీని వల్ల ఆయా సంస్థల మార్కెటింగ్ పరిధి విస్తరించడంతోపాటు.. బ్రాండ్ విలువ పెరిగి, చిరు వ్యాపారులకు సైతం లాభం చేకూరుతుంది. అంతేకాకుండా, యూజర్కు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అవుతుంది. వ్యాపార విస్తరణలో తమ సర్వీస్లను మొబైల్ యాప్లోకి తీసుకురావాలనుకుంటున్న చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు సూపర్ యాప్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. దీనివల్ల అప్పటికే.. మార్కెట్లో ఉన్న యాప్లతో పోటీ లేకుండా వ్యాపార విస్తరణ కోసం అధిక మొత్తం పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం ఉండదు.
ఈ యాప్ల ద్వారా కస్టమర్లకు ఓ వైపు సర్వీస్లను అందిస్తూనే.. మరోవైపు కంపెనీలో ఇతర సర్వీస్లను ప్రమోట్ చేయొచ్చు. అంటే, సూపర్ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసిన యూజర్కు, అదే యాప్ ద్వారా క్యాబ్ సర్వీస్ను బుక్ చేసుకోమని సూచించవచ్చు. అలా చేయడం వల్ల .. కొంత రాయితీ లభిస్తుందని సర్వీస్ను ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో యాప్ ఆదాయం పెరగడమే కాకుండా..ఒకే చోట వేర్వేరు సర్వీస్లు అందిస్తున్నామని యూజర్కు తెలియజేవచ్చు.
భవిష్యత్తు సూపర్ యాప్లదే
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సేవలను అందించే సూపర్ యాప్లు లేవు. ఇప్పటి వరకు సూపర్ యాప్ల సేవలు ఆయా దేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి. భవిష్యత్తులో ఎక్స్ (ట్విటర్) వంటి యాప్లు ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను విస్తరించే అవకాశం ఉంది. ఎక్స్తోపాటు మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ఓ సూపర్ యాప్ను అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ యాప్ ద్వారా షాపింగ్, మెసేజింగ్, వెబ్ సెర్చ్, న్యూస్ ఫీడ్, ఈ-కామర్స్.. ఇలా అన్నింటినీ ఒకే వేదిక మీదకు తీసుకురావాలని యోచిస్తోందట.
భారత్లో రిలయన్స్ జియో, టాటా న్యూ వంటి యాప్లు సూపర్ యాప్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అదానీ గ్రూప్ సైతం ఒక సూపర్ యాప్ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థికపరమైన సేవలను అందిస్తున్న పేమెంట్ యాప్లు వివిధ రకాల సేవలను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. భవిష్యత్తులో ఇవి కూడా సూపర్ యాప్లుగా మారే అవకాశం ఉంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సూపర్ యాప్ల మార్కెట్ పరిధి 426 బిలియన్ల డాలర్లకు చేరుతుందని విశ్లేషకులు అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర