బ్రేకింగ్

breaking
15 Aug 2022 | 13:29 IST

అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తేలుస్తాం: పవన్‌

అమరావతి: రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధిపై ప్రశ్నిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తనకు కులం రంగు పులుముతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం పవన్‌ మాట్లాడారు. ‘‘ఇష్టానుసారం మాట్లాడేవారికి తగిన రీతిలో జవాబు చెప్పగలను. జనసేన అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తేలుస్తాం. ఒక్కసారి జనసేనవైపు చూడమని ప్రజల్ని కోరుతున్నాను. పదవి కోరుకుంటే 2009లోనే ఎంపీ అయ్యేవాడిని. పార్టీ నడపటానికి అర్హత వైకాపాకే ఉందా? మాకు లేదా?’’ అని పవన్‌ ప్రశ్నించారు.

మరిన్ని

తాజా వార్తలు