బ్రేకింగ్

breaking
29 Nov 2022 | 16:35 IST

వైఎస్‌ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్‌: వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ వైతెపా సభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెరాస కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం సృష్టించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పాదయాత్రకు పలు షరతులతో అనుమతి ఇచ్చింది. సీఎం కేసీఆర్‌పై, రాజకీయ, మతపరమైన అంశాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని పేర్కొన్న న్యాయస్థానం.. పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను ఆదేశించింది.

మరిన్ని

తాజా వార్తలు