బ్రేకింగ్

breaking
17 Apr 2024 | 13:27 IST

ఇది బొండా ఉమాను ఇరికించే కుట్ర: చంద్రబాబు

అమరావతి: సీఎంపై రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో తెదేపా నేతలపై వైకాపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బొండా ఉమాను ఇరికించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హత్యాయత్నం అంటూ తెదేపాపై బురద చల్లాలని చూస్తున్నారన్నారు. తప్పు చేసే అధికారులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వైకాపా ప్రయత్నాలను ప్రజలు ఛీత్కరిస్తున్నారని చెప్పారు. నాలుగు రోజులైనా ఘటనపై పోలీసులు ప్రకటన చేయలేదని చంద్రబాబు తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు