
పౌరాణిక చిత్రం ద్వారా కథానాయకుడైన ఏయన్నార్ తొలిరోజుల్లో జానపద హీరోగా జనానికి చేరువయ్యారు. ఆ దశలో సాంఘిక చిత్రాలకు సరిపోడన్న ముద్ర కూడా ఆయన మీద పడింది. అలాంటి రోజుల్లో ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ‘సంసారం’ (1950)లో ‘వేణు’ పాత్రలో నటించే అవకాశం తొలిసారిగా వచ్చింది. జానపదాల నటుడికి ప్యాంటూ, షర్టూ పాత్రేమిటి? అని అప్పటి పరిశ్రమ వింతగా చెప్పుకొందట. దాన్ని సవాలుగా తీసుకున్న అక్కినేని ఆ వేషం కోసం పారితోషికాన్ని కూడా తగ్గించుకున్నారట. ‘సంసారం’ సినిమా ప్రథమార్ధంలో అమాయక పల్లెటూరి కుర్రాడిగా, మొరటుగా ఉండే ‘వేణు’ పాత్ర పట్నానికి చేరిన తర్వాత పూర్తిగా మారిపోతుంది. వేష, భాష, కవళికలు విభిన్నంగా కనిపిస్తాయి. తన పాత్ర మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన నాగేశ్వరరావు ‘సంసారం’లోని ‘‘కల నిజమాయేగా కోరిక తీరేగా..’’ పాటలో గ్లామరస్గా కనిపించడం కోసం ఏదైనా చెయ్యాలని ఆలోచించారట.
మద్రాసు మౌంట్ రోడ్డులోని ‘మయో ఆప్టికల్స్’ దుకాణానికి వెళ్లి, అప్పటి గుండ్రని అద్దాలకు భిన్నంగా తన ముఖానికి చక్కగా అమరే నలుచదరం కళ్లద్దాల్ని ఎంపిక చేసుకుని పాటలో ధరించారట. ‘సంసారం’ విజయం సాధించింది. మద్రాసు పరిసరాల్లోని పల్లవరంలో చాలా రోజులు ఆడటంతో పాటు ‘కల నిజమాయేగా’ కళ్లజోడు ట్రెండ్ సృష్టించింది. ఆ ఊపులో మద్రాసు ‘మయో ఆప్టికల్స్’ దుకాణంలో అప్పట్లోనే అయిదు వేల పైచిలుకు కళ్లద్దాలు అమ్ముడుపోయాయట. దుకాణం యజమానులు అక్కినేనికి కృతజ్ఞతలు చెప్పుకోవడం, అప్పటి నుంచి చాలాకాలం పాటు ఆయనకు కావలసిన కళ్లద్దాలు అక్కడి నుంచే రావడం విశేషం.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- టీమిండియా సమష్టి విజయం
- బంపర్ ఆఫర్ కొట్టేసిన షాలినీ పాండే
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- పాస్పోర్ట్పై కమలం చిహ్నం?
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- 2019లో గూగుల్లో అధికంగా సెర్చ్ చేసినవివే..
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్