బ్రేకింగ్

breaking
17 Apr 2024 | 18:39 IST

ఎంత దెబ్బతీస్తే అంత బలపడతాం: పవన్‌

పెడన: తమ పార్టీ అభ్యర్థులను వైకాపా ఎందుకు మార్చిందో చెప్పాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. పెడనలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో పవన్‌ పాల్గొని ప్రసంగించారు. మత్స్యకారుల పొట్ట కొట్టేందుకు జీవో 217 తెచ్చారని విమర్శించారు. మత్స్యకారుల సంపద పెరిగేలా భాజపా మేనిఫెస్టో తీసుకొస్తుందని, దాన్ని కచ్చితంగా అమలయ్యేలా చూస్తామని చెప్పారు. కూటమికి ఎన్ని సమస్యలు సృష్టించినా ధీటుగా ఎదుర్కొంటామని, ఎంత దెబ్బతీస్తే అంత బలపడతామని అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు