బ్రేకింగ్

breaking
09 May 2024 | 12:09 IST

న్యాయం గెలుస్తుందా.. నేరం గెలుస్తుందా?: షర్మిల

పులివెందుల: ఎంపీగా అవినాష్‌రెడ్డి కడప స్టీల్‌ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ‘‘హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నారు. అవినాష్‌ నిందితుడని సీబీఐ చేసిన ఆరోపణల ప్రకారమే మాట్లాడుతున్నాం. బాబాయిని చంపిన హంతకులనే సీఎం కాపాడుతున్నారు. జగన్‌కు అధికారమిచ్చింది ఆయన్ను కాపాడటానికేనా? ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశా... ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా. న్యాయం గెలుస్తుందా.. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తోంది’’ అని షర్మిల తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు