బ్రేకింగ్

breaking
09 May 2024 | 14:17 IST

వైకాపా ఫ్యాన్‌ ముక్కలవడం ఖాయం: చంద్రబాబు

కురుపాం: వైకాపా ఫ్యాన్‌ ముక్కలవడం ఖాయం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. దళిత, గిరిజన ద్రోహి.. జలగ జగన్‌. ఆయన ఓటేసిన వారిని కాటేసే రకం. ఐదేళ్లలో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? ఏకలవ్య మోడల్‌ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ను దోచుకున్నారు. జగన్‌ మీ బిడ్డ కాదు.. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ’’ అని చంద్రబాబు విమర్శించారు.

మరిన్ని

తాజా వార్తలు