బ్రేకింగ్

breaking
30 Apr 2024 | 18:27 IST

గుజరాత్‌ పెత్తనమా..? తెలంగాణ పౌరుషమా?: రేవంత్‌

రేగొండ: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్‌ భాజపాతో పొత్తు పెట్టుకోబోతున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా రేగొండ జనజాతర సభలో రేవంత్‌ ప్రసంగించారు. వరంగల్‌ పట్టణానికి ఔటర్ రింగ్‌ రోడ్డు, ఎయిర్‌పోర్టు రాకుండా మోదీ అడ్డుకున్నారని విమర్శించారు. ‘‘నన్ను అరెస్టు చేయాలని అమిత్‌ షా దిల్లీ పోలీసుల్ని ఆదేశించారు. గుజరాత్‌ పెత్తనమా? తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందాం. దిల్లీ పోలీసుల్ని కాదు.. సరిహద్దులో సైనికుల్ని తెచ్చుకున్నా భయపడను’’ అని రేవంత్‌ అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని