బ్రేకింగ్

breaking
07 May 2024 | 11:28 IST

జనం గురించే ఆలోచించే వ్యక్తి పవన్‌: చిరంజీవి

హైదరాబాద్‌: తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం పవన్‌ కల్యాణ్‌ది అని ప్రముఖ సినీనటుడు చిరంజీవి అన్నారు. జనసేన గెలుపు కోరుతూ ఆయన ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటారు. కానీ పవన్‌ కల్యాణ్‌ తన సొంత సంపాదనను కౌలు రైతులు, జవాన్ల కోసం ఖర్చు పెట్టాడు. సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చాడు. అన్యాయాన్ని ఎదిరించేందుకు, జనం కోసం జన సైనికుడయ్యాడు’’ అని చిరంజీవి తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు