బ్రేకింగ్

breaking
07 May 2024 | 17:22 IST

పెద్దిరెడ్డిని ఇంటికి పంపాల్సిందే: కిరణ్‌కుమార్‌ రెడ్డి

పుంగనూరు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డీసీసీ పదవి కోసం తన కాళ్లు పట్టుకున్నారని మాజీ సీఎం, భాజపా నేత కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డిని ఇంటికి పంపాల్సిందేనన్నారు. చంద్రబాబుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘‘ చంద్రబాబు రోడ్లు మంజూరు చేస్తే.. పెద్దిరెడ్డి కమీషన్లు తీసుకున్నారు. ప్రజల నుంచి కూడా కమీషన్లు తీసుకునే వ్యక్తికి ఓటు వేస్తారా? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎయిడ్స్‌ కంటే ప్రమాదకరం. డబ్బులు ఇస్తున్నారని అమ్ముడుపోవద్దు. ప్రజలు ధైర్యంగా ఓటు వేయాలి’’ అని కిరణ్‌కుమార్‌ అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు