బ్రేకింగ్

breaking
07 May 2024 | 20:31 IST

ప్రజలు తిరస్కరించినా కేసీఆర్‌లో మార్పు రాలేదు: రేవంత్‌

హనుమకొండ: రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్‌కు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఓటమి తర్వాతనైనా కేసీఆర్‌లో మార్పువస్తుందని, రైతులకు క్షమాపణ చెప్పి ఓట్లు అడుగుతారని ఆశించామని కానీ, ఆయనలో మార్పు రాలేదు సరికదా.. ఈ ప్రభుత్వం పడిపోతుందంటున్నారని మండిపడ్డారు.  హనుమకొండ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను మోదీ గుజరాత్‌కు తరలించారు. ఆయన గుజరాత్‌కు మాత్రమే ప్రధానా? దేశం మొత్తానికా?ఈ పదేళ్లలో తెలంగాణకు మోదీ గాడిదగుడ్డు మాత్రమే ఇచ్చారు’’ అని రేవంత్‌ విమర్శించారు.

మరిన్ని

తాజా వార్తలు