అమ్మ పద్ధతులనే పాటిస్తున్నా!

అందాల తార శ్రీదేవి వారసురాలిగా వెండి తెరకు పరిచయమైంది జాన్వీ కపూర్‌. కానీ విభిన్న పాత్రలను ఎంచుకుంటూ గుర్తింపు తెచ్చుకుంది.

Published : 20 Jul 2021 00:50 IST

అందాల తార శ్రీదేవి వారసురాలిగా వెండి తెరకు పరిచయమైంది జాన్వీ కపూర్‌. కానీ విభిన్న పాత్రలను ఎంచుకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. తన సౌందర్య పరిరక్షణలో తల్లి పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. శ్రీదేవికి రసాయనాలు ఎక్కువగా ఉండే ప్రొడక్ట్‌లను ఉపయోగించడం ఇష్టముండదట. అందుకే ఇంట్లో దొరికే వాటినే ఉపయోగించేదట. తలకు నూనెనీ ఎండిన పూలు, ఉసిరితో తనే కాచి సిద్ధం చేసేదట. వాటినే జాన్వీ కొనసాగిస్తోంది. ఇంకా ఏం చెప్పిందంటే...

‘ఆ రోజు ఏ పండు ఆహారంగా తీసుకుంటే దాని రసాన్నే పాలు లేదా వెన్నతో కలిపి ముఖానికి పట్టిస్తా. పండ్లలో సి విటమిన్‌ ఉంటుంది. చర్మానికి ఇది చాలా మంచిది. ఆరెంజ్‌, అరటి, బొప్పాయి, అవకాడో ఇలా దేన్నైనా ప్రయత్నించవచ్చు. జుట్టు విషయానికొస్తే ప్రతి మూడు రోజులకోసారి తలకు నూనెను పట్టించి, మర్దనా చేసుకుంటా. మెంతులు, ఉసిరి, కోడిగుడ్లతోపాటు మెంతి ఆకునూ తలకు పట్టిస్తా. ఇవి చుండ్రును దూరంగా ఉంచడంతోపాటు సహజ కండిషనింగ్‌నూ అందిస్తాయి. వీటితోపాటు నీరు ఎక్కువగా తీసుకోవడం, ఎప్పుడూ ఆనందంగా ఉండటం తప్పనిసరి’. చదివారుగా... నచ్చితే మీరూ ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్