బ్రేకింగ్

breaking
09 May 2024 | 17:28 IST

బటన్‌ నొక్కి ప్రజలకు ఇచ్చిందెంత? జగన్‌ తిన్నదెంత?: చంద్రబాబు

చీపురుపల్లి: ‘బటన్‌ నొక్కి ప్రజలకు ఇచ్చింది ఎంత? జగన్‌ తిన్నదెంత’ అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ జగన్‌ ఎప్పుడూ నిజం మాట్లాడరు. కరెంట్‌ ఛార్జీలు, మద్య నిషేధంపై జవాబు చెప్పి జగన్‌ ఓటు అడగాలి. నిత్యావసరాలు, పెట్రోల్‌ ధరలు ఎందుకు పెంచారో చెప్పాలి?ప్రజల జీవితాలను మార్చేందుకే సూపర్‌ సిక్స్‌ తీసుకొచ్చాం.ఉత్తరాంధ్ర పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలి. సీట్లు ఇచ్చారన్న కారణంతో ఈ ప్రాంతాన్ని దోచుకున్నా బొత్స పట్టించుకోవట్లేదు’’ అని అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు