మొటిమలకు బొప్పాయి రాస్తా!

బొద్దుగా ఉన్నా.. తాజాగా సన్నగా నాజూగ్గా తయారైనా మచ్చలేని అందమైన ముఖం రాశీ ఖన్నా సొంతం. ప్రతి మూడు గంటలకూ సన్‌స్క్రీన్‌ను తప్పక ఉపయోగిస్తుందట. మొటిమలేమైనా వస్తే బొప్పాయి

Published : 18 Jul 2021 00:42 IST

సొగసరి చిట్కా

బొద్దుగా ఉన్నా.. తాజాగా సన్నగా నాజూగ్గా తయారైనా మచ్చలేని అందమైన ముఖం రాశీ ఖన్నా సొంతం. ప్రతి మూడు గంటలకూ సన్‌స్క్రీన్‌ను తప్పక ఉపయోగిస్తుందట. మొటిమలేమైనా వస్తే బొప్పాయి గుజ్జును రాస్తుందట. ఒక్కరోజులోనే తగ్గిపోతాయని చెబుతోంది. అదే తన మచ్చల్లేని రూపానికి రహస్యమంటోంది. తరచూ ముల్తానీ మట్టి, కలబంద గుజ్జును ముఖానికి రాస్తుందట. చర్మం మెరవడానికి ఇవి సాయపడతాయంటోంది. ఆహారంలో ఎక్కువగా పండ్లతోపాటు మంచి నీటినీ అధికంగా తీసుకుంటుంది. మనం ఏం తింటున్నామన్న దానిపైనే మన అందం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన వాటినే ఎంచుకోవాలని సలహానిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్