బ్రేకింగ్

breaking
09 May 2024 | 21:54 IST

సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు చేసిన సీఐడీ

అమరావతి: సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. వైకాపా సోషల్‌ మీడియాలో తెదేపా అధినేత చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ.. కేసు నమోదు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో సీఐడీ కేసు నమోదు చేసింది.

మరిన్ని

తాజా వార్తలు