ఆరోగ్యం పెరుగుతుంది

షడ్రసోపేత భోజనం చేసినా... పెరుగన్నం తింటే కానీ అది పూర్తి కాదు. అలాంటి పెరుగు వల్ల ముఖ్యంగా మహిళలకు ఎన్ని లాభాలున్నాయో తెలుసా?!

Published : 23 Jul 2021 01:07 IST

షడ్రసోపేత భోజనం చేసినా... పెరుగన్నం తింటే కానీ అది పూర్తి కాదు. అలాంటి పెరుగు వల్ల ముఖ్యంగా మహిళలకు ఎన్ని లాభాలున్నాయో తెలుసా?!

పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అది దంతపుష్టికి, ఎముకల దృఢత్వానికీ దోహద పడుతుంది. కీళ్ల నొప్పులను నివారిస్తుంది. ముప్పయి దాటిన స్త్రీలెందరో కాల్షియం లేమితో బాధ పడుతున్నారు. తగినంత పెరుగు తినక పోవడమే ఇందుకు కారణమని సర్వేలు చెబుతున్నాయి.

* కొందరు చిన్నారులు పెరుగన్నం తినడానికి ఇష్టపడరు. పాలు తాగుతున్నారు లెమ్మని వదిలేయక అలవాటు చేయాలి. పాల కన్నా పెరుగే మంచిది.

* పెరుగులో ఉన్న ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేట్లు చేస్తాయి.

* ఇందులో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్‌, పీచుపదార్థాలు ఆహారం త్వరగా జీర్ణమయ్యేట్లు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.పెరుగులోని మినరల్స్‌వల్ల శరీర ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్