Published : 23/06/2021 01:28 IST

అంతరిక్షంలోకి.. టిక్‌టాకర్‌

అంతరిక్షం అనగానే వ్యోమగాములు గుర్తొస్తారు. సామాన్యులకు వాళ్లని చూడటమే ఒక అబ్బురం. కానీ.. కెల్లీ గెరార్డి అనే టిక్‌టాకర్‌కు ఏకంగా స్పేస్‌షిప్‌లో ప్రయాణించే అవకాశమొచ్చింది. అదెలా సాధ్యమైందంటే..!!
వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌ టూరిజం సంస్థ. వచ్చే ఏడాది నుంచి మనుషుల అంతరిక్ష పర్యాటకానికి కృషి చేస్తోంది. ఈ దిశగా పరిశోధనలు చేయనున్నారు. అందుకే కెల్లీ గెరార్డిని ఎంపిక చేశారు. ఈమె ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఆస్ట్రోనాటికల్‌ సైన్సెస్‌ (ఐఐఏఎస్‌)లో పరిశోధకురాలు. ఆస్ట్రోనాటిక్స్‌, స్టెమ్‌ అంశాలతోపాటు తల్లిగా తన అనుభవాలను టిక్‌టాక్‌, ఇన్‌స్టాలలో పంచుకుంటూ ఉంటుంది. తనకు అక్కడ ఒక్కోదానిలో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. స్పేస్‌ టూరిజంపై ఆసక్తి, కొంత ఫాలోయింగ్‌ ఉండటంతో ఈమెను ఎంచుకున్నారు.
కెల్లీ కేవలం వెళ్లి రావడానికే పరిమితం కాదు. మానవ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సాంకేతికతలను తన మీద పరీక్షిస్తారు. సున్నా గ్రావిటీలో ల్యాండింగ్‌, టేకాఫ్‌ సమయాల్లో శరీరంలో, శరీర బరువులో మార్పులకు సంబంధించి బయోమెట్రిక్‌ డేటాను సేకరిస్తారు. ఇది దాదాపుగా 60 నుంచి 75 నిమిషాలపాటు సాగుతుంది. వీటి ఆధారంగా పర్యటక స్పేస్‌ ఫ్లైట్లను మరింత ఆధునీకరిస్తారు.
32ఏళ్ల కెల్లీ స్పేస్‌ స్టేషన్‌లో శిక్షణను ముందుగానే తీసుకుంది. ‘ఇప్పటివరకూ చాలా తక్కువ మందే అంతరిక్షంలో అడుగుపెట్టారు. వారిలో మహిళలు 100 మంది కన్నా తక్కువే. ఇక అమ్మల సంఖ్యను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఇప్పుడు నేనూ వారి జాబితాలో చేరడం నా మూడేళ్ల కూతురు చూస్తుంది. చాలా కష్టమనుకునే పనేదైనా  కొద్దిగా శ్రమపడితే చేయడం సులువని తను తెలుసుకుంటుంది’ అంటోంది కెల్లీ. ఈ పరిశోధనకు ఒప్పుకోవడం ద్వారా తనలా మరెందరో పరిశోధకులకు అవకాశాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి