బ్రేకింగ్

breaking
07 May 2024 | 22:23 IST

వైకాపాకి ఓటు వేస్తే.. మీ భూములు మీవి కాదు: చంద్రబాబు

తిరుపతి: ‘వైకాపాకి ఓటు వేస్తే.. మీ భూములు మీవి కాదు’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతిలో పవన్‌ కల్యాణ్‌తో కలిసి నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. ‘‘ తిరుపతిని విద్యా కేంద్రంగా చేసేందుకు కృషి చేశాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్పీపైనే పెడతాం. సామాజిక పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతాం.. ఏప్రిల్‌ నుంచే దానిని అమలు చేస్తాం. తిరుపతిలో వైకాపాకు డిపాజిట్‌ కూడా రాదు. అమరరాజా బ్యాటరీస్‌ను తరిమేశారు. కోడికత్తి, గులకరాయి డ్రామాలు మనకు అవసరమా?’’ అని చంద్రబాబు అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు