బంధం భద్రంగా

జీవితభాగస్వామిని నొప్పించకుండా మనసులోని మాటను మృదువుగా చెప్పగలగాలి. అప్పుడే ఆ బంధం ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగుతుంది. అందుకు సూచనలిస్తున్నారు...

Published : 06 Dec 2021 01:24 IST

జీవితభాగస్వామిని నొప్పించకుండా మనసులోని మాటను మృదువుగా చెప్పగలగాలి. అప్పుడే ఆ బంధం ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగుతుంది. అందుకు సూచనలిస్తున్నారు మానసిక నిపుణులు.

ఆరోగ్యకరం.. దంపతుల మధ్య చర్చలు, వాదోపవాదాలు.. సహజమే. అయితే ఆ సందర్భం ఏ ఒక్కరిలోనైనా తీవ్ర ఒత్తిడికి దారి తీస్తే మాత్రం ఆ తరహా చర్చ అనారోగ్యకరమే. అది దారి మళ్లుతుందనిపిస్తే దాన్ని అక్కడే ఆపేయడం మంచిది. ఒకవేళ పొరపాటు ఎవరిదైనా ఎదుటివారి మనసును బాధపెట్టినందుకు క్షమించమని అడగాలి.

సాన్నిహిత్యం.. ఆలుమగల మధ్య ఉండే సాన్నిహిత్యం వారిని మరింత ప్రేమతో కట్టిపడేస్తుంది. భాగస్వామి చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకోగలగితే సమస్యలకు తావుండదు.

పంచుకోవాలి.. భార్యాభర్తల మధ్య రహస్యాలు లేకుండా ఉంటే మంచిది. అప్పుడే ఎదుటివారిపై భరోసా ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా వాదోపవాదాలొచ్చినా ఎక్కువసేపు నిలవవు. అలాకాకుండా ఎదుటివారిపై మనసులో అనుమానం ఉంటే మాత్రం దేనిగురించి చర్చ మొదలుపెట్టినా... చివరికి గొడవగా మారే ప్రమాదం ఉంది. తమ వద్ద భాగస్వామి చాలా విషయాలను రహస్యంగా ఉంచుతున్నారనే ఆలోచనే.. అవతలి వ్యక్తిని ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకే... ఏ చిన్న అంశమైనా ఇరువురూ పంచుకోగలిగితే  చాలు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్