చిరునవ్వుతో పలకరించండి!

తక్కువ చిత్రాలతోనే...వెండి తెరపై తనదైన ముద్ర వేసింది రష్మిక మందాన. అలాగే సోషల్‌మీడియాలోనూ జోరు చూపిస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రాం పేజీ రెండుకోట్లమంది ఫాలోవర్లకు చేరువలో ఉంది.

Published : 26 Jul 2021 01:33 IST

క్కువ చిత్రాలతోనే...వెండి తెరపై తనదైన ముద్ర వేసింది రష్మిక మందాన. అలాగే సోషల్‌మీడియాలోనూ జోరు చూపిస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రాం పేజీ రెండుకోట్లమంది ఫాలోవర్లకు చేరువలో ఉంది. దీంతో సమంత, విజయ్‌ దేవరకొండ వంటి ప్రముఖులను దాటి వార్తల్లో నిలిచింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు...నిత్యం అభిమానులకు సామాజిక మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంటూ ఎన్నో విలువైన విషయాలను వారితో పంచుకుంటోంది. జీవితంలో దొరికిన ప్రతి క్షణాన్ని సంతోషంగా గడపాలని, మనసుకు అనిపించినదాన్ని ఆనందంగా చేసేయాలని చెబుతోంది రష్మిక. ఆరోగ్యంగా ఉండటానికి పర్యావరణహిత విధానాలను అనుసరించమని సూచిస్తోంది. మహిళలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం ఎలానో చెబుతోంది. ‘అమ్మాయిలకు కాస్త మొహమాటం ఎక్కువ. కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు సానుకూలంగా ఉండాలంటే...ఎదురుపడిన వారిని నవ్వుతూ పలకరిస్తే సరి. వారి నుంచీ మంచి స్పందన వస్తుంది. నేను ఎవరు కనిపించినా...చిరునవ్వుతో పలకరిస్తా. దీనివల్ల బంధాలు బలపడతాయి. మనసారా నవ్వితే ఆరోగ్యంగానూ ఉంటాం. అంతే కాదండోయ్‌.. ‘నవ్వితే ముఖకండరాలన్నీ పనిచేసి అందాన్ని  మరింత పెంచుతాయి’ అంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్