పిగ్మెంటేషన్‌కు అరటి మందు!

ముఖంపై మచ్చలు, వయసు పెరుగుతున్నప్పుడు వచ్చే పిగ్మెంటేషన్‌ను అరటిపండుతో మటుమాయం చేసేయొచ్చంటోంది సీనియర్‌ నటి భాగ్యశ్రీ. అయిదు పదులు దాటినా అందమైన ఆమె చిరునవ్వుకు....

Updated : 23 Oct 2021 06:07 IST

ముఖంపై మచ్చలు, వయసు పెరుగుతున్నప్పుడు వచ్చే పిగ్మెంటేషన్‌ను అరటిపండుతో మటుమాయం చేసేయొచ్చంటోంది సీనియర్‌ నటి భాగ్యశ్రీ. అయిదు పదులు దాటినా అందమైన ఆమె చిరునవ్వుకు అభిమానులంతా ఇప్పటికీ ఫిదా అవ్వాల్సిందే. ప్రేమపావురాలతో ఎంట్రీ ఇచ్చి, 30 ఏళ్ల తర్వాత తాజాగా తలైవి చిత్రంలో ప్రముఖ పాత్రలో మరోసారి తళుక్కుమందీ తార. ప్రభాస్‌ హీరోగా రానున్న రాధేశ్యామ్‌లోనూ నటిస్తోంది. సోషల్‌ మీడియాలో తరచూ ఈమె మహిళలకు ఆరోగ్యం, పోషకాహారం, ఫిట్‌నెస్‌ వంటి పలు అంశాల్లో ఈమేరకు అవగాహన కలిగిస్తూ ఉంటుంది. తన సౌందర్య రహస్యాన్ని ఇలా వివరిస్తోంది...

‘‘అందంలో చర్మసౌందర్యం ఓ భాగం. ముఖ్యంగా వయసు పెరుగుతున్నప్పుడు ముఖంపై ముడతలు, పిగ్మెంటేషన్‌, మచ్చలు కనిపిస్తే మనసంతా ఆందోళనగా ఉంటుంది. అలా అనిపించినప్పుడు అరటిపండుతో నా చర్మాన్ని మెరుగుపరుచుకుంటా. రోజుకొకసారి ముఖంపై అరటి తొక్కతో మృదువుగా మర్దనా చేసి పావుగంట ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేస్తే చాలు. ముఖం మెరుపులీనుతుంది. సిలికా చర్మంపై మృతకణాలను పోగొట్టి, కొత్త కణాలను అభివృద్ధి చేస్తుంది. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. ఇందులోని ఫెనాలిక్‌ చర్మంలోని సూక్ష్మజీవులను సంహరించి పిగ్మెంటేషన్‌, మచ్చలు వంటివాటిని తొలగిస్తుంది’ అంటున్న భాగ్యశ్రీ పోషకాహారం, ఆరోగ్య నిపుణురాలిగా ‘అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డ్రగ్‌లెస్‌ ప్రాక్టీషనర్స్‌’ నుంచి గుర్తింపు పొందడం విశేషం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్