బ్రేకింగ్

breaking
28 Mar 2024 | 13:07 IST

వైకాపా పని అయిపోయింది.. ఇక 46 రోజులే: చంద్రబాబు

రాప్తాడు: వైకాపా పని అయిపోయింది.. ఇక 46 రోజులే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాప్తాడులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్‌ 90 శాతం హామీలు పూర్తి చేశానంటున్నారు.. నేను ఏడింటిని అడుగుతున్నా. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తా అన్నారు.. తెచ్చారా? మద్యపాన నిషేధం చేయకపోతే.. 2024లో ఓట్లు అడగను అన్నారు? చేశారా? వారంలో సీపీఎస్‌ రద్దు చేశారా? ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చారా? ఏ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఏటా మెగా డీఎస్సీ ఇచ్చారా? కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నారు.. తగ్గించారా, పెంచారా? పోలవరం పూర్తిచేస్తా అన్నారు.. దాన్ని గోదావరిలో ముంచేశారు’’ అని చంద్రబాబు తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని