బ్రేకింగ్

breaking
07 May 2024 | 17:40 IST

అవినీతి సొమ్మును జూన్‌ 4 తర్వాత కక్కిస్తా: చంద్రబాబు

పుంగనూరు: మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి చేసి రూ.30 వేల కోట్లు కొట్టేసిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అక్రమ కేసులు పెట్టి ప్రజలను వేధిస్తోందని అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే వ్యక్తి చల్లా బాబు. పెద్దిరెడ్డి ఆధిపత్యానికి కిరణ్‌కుమార్‌రెడ్డి చెక్‌ పెడతారు. ఆయన ఎంపీ అయితే పెద్దిరెడ్డికి నిద్రపట్టదు. పెంచిన మద్యం ధరల్లో పెద్దిరెడ్డి, జగన్‌ వాటా ఎంత? వైకాపా నేతల అవినీతి సొమ్మును జూన్‌ 4 తర్వాత కక్కించి.. ప్రజలకు పంచుతా’’ అని చంద్రబాబు అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు