బ్రేకింగ్

breaking
07 May 2024 | 22:04 IST

తిరుమల పవిత్రతను కాపాడుతాం: పవన్‌ కల్యాణ్‌

తిరుపతి: తిరుమల పవిత్రతను కాపాడుతామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి పవన్‌ కల్యాణ్‌ తిరుపతిలో రోడ్‌ షో నిర్వహించారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి.. అధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను రిసార్ట్‌గా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవాణి ట్రస్ట్‌ పేరుతో టికెట్‌ ధరలు పెంచారని, ఎక్కడ చూసినా దళారీ వ్యవస్థ రాజ్యమేలుతోందన్నారు. వేంకటేశ్వరస్వామిని అవమానించిన వ్యక్తికి ఎందుకు ఓటేయాలని పవన్‌ ప్రశ్నించారు.

మరిన్ని

తాజా వార్తలు