కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తుంటే..
కొంతమందికి ఉదయం నిద్ర లేవగానే కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. అయితే చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోగానే ఉబ్బిన కళ్లు మళ్లీ మామూలుగా అయిపోతాయి. అయితే ఇలా చేసిన తర్వాత కూడా కళ్లు ఉబ్బినట్లుగానే ఉంటే ఏదో సమస్య ఉందని భావించాలంటున్నారు నిపుణులు
కొంతమందికి ఉదయం నిద్ర లేవగానే కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. అయితే చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోగానే ఉబ్బిన కళ్లు మళ్లీ మామూలుగా అయిపోతాయి. అయితే ఇలా చేసిన తర్వాత కూడా కళ్లు ఉబ్బినట్లుగానే ఉంటే ఏదో సమస్య ఉందని భావించాలంటున్నారు నిపుణులు. ఈక్రమంలో కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వారు సూచిస్తున్నారు.
ఈ చిట్కాలతో..
⚛ శరీరం డీహైడ్రేషన్కు గురైనా కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయట! అందుకే నీళ్లు ఎక్కువగా తాగమంటున్నారు నిపుణులు.
⚛ నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
⚛ టీ, కాఫీ, కార్బొనేటెడ్ ఎనర్జీ డ్రింకులు, ఆల్కహాల్... తదితర పానీయాలను తరచుగా తీసుకోవడం వల్ల కళ్లు ఉబ్బిపోయి అందవిహీనంగా తయారవుతాయి. కాబట్టి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది.
⚛ కొత్తిమీరను డైట్లో చేర్చుకోవడం వల్ల వేగంగా ఈ సమస్య నుంచి బయటపడచ్చు. ఎందుకంటే కొత్తిమీర మూత్ర పిండాల ద్వారా వ్యర్థ పదార్థాలు, మలినాలను వడపోసి బయటకు పంపించేస్తుంది. సూప్స్, సలాడ్లలో కొత్తిమీరను కలిపి తీసుకుంటే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ క్రమంలో దోసకాయ, కొత్తిమీర, టొమాటో... తదితర పదార్థాలతో తయారుచేసిన జ్యూస్ను తీసుకోవడం వల్ల ఉబ్బిన కళ్ల నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చు. మరి ఆ జ్యూస్ తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు
⚛ దోసకాయ
⚛ వాము ఆకులు
⚛ టొమాటో
⚛ కొత్తిమీర- కొంచెం
⚛ నిమ్మరసం- టీస్పూన్
తయారీ
పైన పేర్కొన్న కూరగాయలన్నింటినీ ముందుగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అనంతరం మిక్సీలో వేసి జ్యూస్ లాగా తయారుచేసుకోవాలి. దీనికి నిమ్మరసాన్ని కలిపి వెంటనే తాగాలి. ఇలా కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా తాగితే ఉబ్బిన కళ్లు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి.
ఈ చిట్కాలు పాటించినా సమస్య తగ్గకపోగా.. దురద, మంట, ఎరుపెక్కడం.. లాంటి సమస్యలు ఎదురవుతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.