బ్రేకింగ్

breaking
04 May 2024 | 17:37 IST

జగన్‌కు ప్యాలెస్‌లు.. పేదలకు పూరిళ్లా?: చంద్రబాబు

నూజివీడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. సీఎం జగన్‌కు విధ్వంసమే తెలుసని విమర్శించారు. ఎన్టీఆర్‌ జిల్లా నూజివీడులో చంద్రబాబు ప్రసంగించారు.‘‘ నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని చాలా రోజులుగా పోరాడుతున్నారు. మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తా. జగన్‌కు ప్యాలెస్‌లు, ప్రజలకు మాత్రం పూరిళ్లు. ఇదెక్కడి న్యాయం. అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తాం’’ అని అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు