బ్రేకింగ్

breaking
07 May 2024 | 23:27 IST

రాజస్థాన్‌పై దిల్లీ విజయం

దిల్లీ: ఐపీఎల్‌-2024లో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి ఓటమిపాలైంది. రాజస్థాన్‌ బ్యాటర్లలో సంజు శాంసన్‌ (86; 46 బంతుల్లో) చెలరేగిపోయాడు. రియాన్‌ పరాగ్‌ (27), శుభమ్‌దూబె (25) రాణించారు. దిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ 2, కుల్‌దీప్‌ యాదవ్‌ 2, ముకేశ్‌ కుమార్‌ 2, అక్షర్‌ పటేల్‌, రసిఖ్‌ సలాం చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 221 పరుగులు చేసింది. ఫ్రేజర్‌ (50), పోరెల్‌ (65) అర్ధశతకాలతో చెలరేగారు. బౌలర్లలో అశ్విన్‌ 3, బౌల్ట్‌, సందీప్‌, చాహల్‌ తలో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు