బ్రేకింగ్

breaking
09 May 2024 | 21:50 IST

కోహ్లీ సెంచరీ మిస్‌.. పంజాబ్‌ టార్గెట్‌ 242

ధర్మశాల: పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (92; 47 బంతుల్లో 7×4, 6×6) సెంచరీ మిస్‌ అయ్యింది. పాటిదార్‌ (55) అర్ధశతకంతో విరుచుకుపడ్డాడు. డుప్లెసిస్‌ (9), జాక్స్‌ (12) నిరాశపరిచారు. చివర్లో గ్రీన్‌ (46; 27 బంతుల్లో 5×4, 1×6), దినేశ్‌ కార్తీక్‌ (18) ఆకట్టుకున్నారు. బౌలర్లలో హర్షల్‌ 3 వికెట్లు పడగొట్టగా, విధ్వత్‌ 2, అర్ష్‌దీప్‌, సామ్‌ కరన్‌ తలో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు