బ్రేకింగ్

breaking
15 Aug 2022 | 18:00 IST

TS: రేపు ఉ.11:30కు అన్ని జంక్షన్లలో రెడ్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రేపు ఉ.11:30గం.కు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేయనున్నారు. అన్ని జిలాల్లోనూ జాతీయ గీతాలాపన చేసేలా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఆబిడ్స్‌ జీపీవో సర్కిల్‌లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని అన్ని కూడళ్ల వద్ద జాతీయ గీతాలాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ పోలీసులు అన్ని వైపులా రెడ్‌ సిగ్నళ్లు వేయనున్నారు. రహదారులపై నిమిషం పాటు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోనున్నాయి.

మరిన్ని

తాజా వార్తలు